Saturday, March 20, 2021

శివోహం

ఆధ్యాత్మిక చింతన
శ్రీరాముని కరుణ


సకల గుణాభిరాముడు, రామా, శ్రీరామ అనగానే భాధలన్ని ఈడేరు తాయి. నేటికి రామాలయం లేని ఊరు అరుదు. శ్రీరాముడే మనకు ఆదర్శం. ఆయన జీవితం మనకు సందేశం అనేది ప్రతి ఒక్కరూ గమనించవలసింది. శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఎందరినో కరుణించి పుణ్య లోక ప్రాప్తి కలిగించాడు. అహల్యకు శపవిమోచన కలింగించాడు.

 
శబరికి సైతం స్వర్గలోక ప్రాప్తి కలిగించాడు. అందుకు నిదర్శనం సీతాన్వేషన చేస్తున్నప్పుడు జటాయువును చూడటం రెక్కలు విరిగి ధీన స్థితిలో, కోన ఊపిరితో ఉండటం జరిగింది. ఆ స్థితిలో జటాయు వును చూడగానే పరిస్థితి అర్థ మైంది. శ్రీరాములవారికి, సీతా దేవిని రావణుని చెర నుండి కాపాడటానికి రావణుడితో జటా యువు పోరాడి చేసిన త్యాగం మెచ్చుకుని దుర్కిస్తాడు. శ్రీరాము ని చూడగానే కళ్లు తేలేసింది జటాయువు. రాముడు ఆ పక్షికి దహన సంస్కారాలు చేసి, నా అనుజ్ఞతతో ఉత్తమలోకాలకు వెళ్లమని ఆదేశించాడు.

ఆ విధంగా శ్రీరాముని కరుణ వలన జటాయువుకు పుణ్య లోకం ప్రాప్తించింది. జంతువులలో చాలా అల్పమైన ప్రాణి ఉడుత కూడా వంతెన కట్టే సయంలో తన వంతు బాధ్యతగా సహాయపడిందని అంటారు. లంకా నగరానికి సముద్రం మీద వారధి నిర్మిస్తున్నప్పుడు వానరులు రాళ్లు, రప్పలు తెచ్చి వారిధి నిర్మాణానికి పూనుకున్నారు.

ఎవరికి చేతనైన సహాయం వారు చేస్తున్నారు. ఆ వానరులలో చిన్న, చిన్న వానర ములు కూడా తమ చేతనైన సహాయం చేస్తున్నారు. అప్పుడొక ఉడుత ఇదంతా గమనించి నా వంతు సమాయం చేయాలనే తీర్మానించుకుంద. చిన్న వానరులు చేస్తున్న పని తదేకంగా గమనించి, తన అల్పత్వాన్ని లెక్క చేయకతాను ఇసుకలో దొర్లి తన వంటికి అంటుకుని ఉన్న ఇసుక రేణువులను వారధి కట్టే చోట దులుపుతూ సముద్రంలో వేసింది.

అది పదే పదే అటు ఇటు తిరుగుతూ తన చేతనైన సహాయం చేసింది. ఉడుత చేస్తున్న ఆ పనిని పరిశీలనగా చూసిన శ్రీరాముని మనసు ద్రవించి ఉడుతను చేతిలోకి తీసుకుని దాని వీపుపై ప్రేమగా నిమిరాడని దానికి గుర్తుగా ఉడుత వీపు పై మూడు చారలు నేటికి ఉన్నాయి.

ఆ ఉడుత జాతికి శ్రీరాముని కరుణ కటాక్షం వలన ఉన్నత లోక ప్రాప్తమైంది. రామాయణం ఈ జగతుత ఉన్నంత వరకు, శ్రీరాముని కథను జనులు చదివినంత వరకు మనం వానరులను గుర్తుకు చేసికొనకుండా ఉండలేం. అనామకంగా అడవులలో సంచరించే వానరాలకు శ్రీరా ుని కరుణ కటాక్షం వలన ఈ అదృష్టం కలిగింది. రామ, రావణ యుద్ధంలో మరణించిన వారందరూ సజీవులై శ్రీరాముని కరుణా కటాక్షం వలన జీవించారు.

ఓ జటాయువు, ఓ ఉడుత అని చేసిన త్యాగాలకు పుణ్య లోకం ప్రాప్తించి ఉంటే అన్ని తెలిపిన మానవులకు ఆ శ్రీరాముని నామోచ్చారణతో లోక ప్రాప్తి కలుగు తుందని అవసానదశలోనే కాకుండా ప్రతి నిత్యం శ్రీరామ! జయ రామ! జయ జయ రామ అనే రామ నామం వలన ఆ శ్రీ రాముని కరుణా కటాక్షమునకు ప్రతి ఒక్కరూ పాత్రులు కావాలని అశిద్దాం.

వార్త పత్రిక నుండి సేకరణ

శివోహం

నా ఊపిరి
చూపు
ప్రాణం
పయనం అన్నీ నీవే శివ...
చివరాఖరి నా చూపు కూడా నీ వైపే...

మహాదేవా శంభో శరణు.. 
ఓం శివోహం... సర్వం శివమయం

Friday, March 19, 2021

శివోహం

ఆనందం ఆనందం ఆనందం ఎక్కడ దొరుకుతుంది ఈ ఆనందం...
అసలైన ఆనందం కేవలం నిర్వికల్ప సమాధి లోనే తప్ప మరెక్కడా లేదు...
దొరకదు కూడా ఆలోచించండి...   

 *ఓం నమః శివాయ*

శివోహం

అమ్మా భవానీ... 
మాతా మహేశ్వరి
దుర్గ భవాని 
చండి నారాయణి నమో నమః. 
ఓం మాతా శక్తి స్వరూపిణి
లోకమాత జగజ్జనని రక్షమామ్...

శివోహం

లోకం ఇచ్చే ఆనందం కొంతకాలమే ఉంటుంది...

శాశ్వత ఆనందం శివయ్య సేవలోనే ఉంటుంది...

ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నీ ముందు అఖండ జ్యోతిలా  
వెలిగి పోయే మధుర క్షణాల కోసమే
నా ఎదురు చూపులని ప్రత్యేకంగా చెప్పాలా శివ...

మహాదేవా శంభో శరణు...

ఆధ్యాత్మిక చింతన

ఆధ్యాత్మిక చింతన

భగవంతుడు కనపడుటలేదని మానవులు బాధపడుచున్నారు. భగవంతుడు ఉన్నాడా లేడా ! ఉంటే తప్పక కనబడాలి కదా అని విచారణ చేయుచున్నారు. ఇందుకు కలడు అందురు, ఎందెందు వెదకిచూచిన అందందే కలడని పెద్దలు చెప్పుచుందురు. కలడు కలండనెడివాడు కలడోలేదో యను అనుమానము వలన మానవులకు మనమున కలత చెంది యుండుట తెలియచునేయున్నది. ప్రతి నిత్యం మనం సూర్యుడిని చూస్తున్నాం.

 
సూర్యునికి మనకు మధ్య ఆకాశమున మేఘము ఏర్పడినప్పుడు మనం సూర్యుడిని చూడలేకపోతి మిగదా అప్పుడువాయువు వచ్చి ఆ మేఘాలను పక్కకు నెట్టివేయుచున్నది. అప్పుడు సూర్యదర్శనం చేయుగలుగుచున్నాం.

ఈ విషయం అందరికి తెలిసినదే. మనకు భగవంతునికి మధ్య అజ్ఞానం ఆవహించబడడం వలన భగవంతుడు మనకు కనబడడం లేదని శాస్త్రం చెప్పుచున్నది. ఈ అజ్ఞానమును జ్ఞానం వలన తొలగినప్పుడు భగవంతుని దర్శనం సిద్ధించునని శాస్త్రం చెప్పుచున్నది.

సూర్యుడు ప్రాతఃకాలమున ఉదయించిన చీకటి కనుమరుగుకాగలదు. అలాగే జ్ఞానం మానవులందు వికసించిన అజ్ఞానం ఇక యుండదు. ఈ ధరణిపై సమస్త ప్రాణికోటి జన్మించి జీవించుచున్నవి. మానవులు కూడ ఈ ప్రాణికోటి యందు ఒక భాగమే వీరును జీవించుచున్నారు.

ప్రాణులకు బుద్ధికోశం లేదు. మానవులకు మాత్రమే బుద్ధికోశం కలదు. మానవులు బుద్దికోశంతో జ్ఞాన వంతులుగాయున్నారు. ఇట్టి మానవులకు అజ్ఞానం ఎలా సంభవించినదని వాపోవుఞచున్నారు. ఈ ప్రకృతి ఈ విధంగా జనించుటకు మూలాధారంగా త్రిగుణములు కారణం.

త్రిగుణములు ప్రకృతి యందు ఉన్నందు వలన ప్రాణులు ప్రకృతి అంశములే కావున త్రిగుణములు మానవ్ఞలందు కలవ్ఞ. కావ్ఞన ఇష్టం అయిష్టం ఇష్టాఇష్టం అను భావన మరియు అహంకారం, స్వార్థం, ఏర్పడినది కావ్ఞన అజ్ఞానమనగా ఇట్టిస్థితి యండుంట యని శాస్త్రం చెప్పుచున్నది.

మానవులు బుద్ధితో ఆలోచించి కర్మలు ఆచరించిన కలుగు ఫలం అనుభవించవలయునుగదా ఇట్టి స్థితి ధర్మసమ్మతం. కర్మలు అహంకారంతో ఆచరించుట కలిగిన ఫలం స్వార్థపరంగా అనుభవించుట, కర్మలకు దాసోహం వలన ఇష్టం అయిష్టం, ఇష్టా ఇష్టం కలిగి యున్నప్పుడు మమకారముచే బంధంగావింప బడియుండుటయే అజ్ఞానం.

ఈ అజ్ఞానం వలన సత్యపదార్థం భగవంతుడు కనబడుటలేదని శాస్త్రం చెప్పుచున్నది. భగవంతునికి పుట్టుకలేదు. రూపం లేదు. నామంలేదు. ఆయన ఎచటయున్నాడో స్థావరం తెలియుట లేదు. భగవంతుడిని దర్శించాలి యని తపన మానవులందు కలుగుచున్నది. భగవంతుని నివాస స్థలం కనుగొనాలంటే జ్ఞానంచే తెలుసుకొనగలం ఇది సత్యం.

వార్త పత్రిక నుండి సేకరణ

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...