**భగవంతుని భావమే మాయ . మాయ యొక్క కర్మాచరనే సృష్టి .
భగవంతుని భావం ఆగితే మాయ ఆగుతుంది . మాయ ఆగినప్పుడు
సృష్టి అందులో లయం అవుతుంది . మనం మన భావాన్ని ఆపుట
ద్వారా సృష్టిలో కాక , బ్రహ్మం లో ఉంటున్నాము . అంటే భావంగా
ఉండక , మౌనం గా ఉండాలి . అట్టి స్థితి కాలాతీతమై కాలచక్రంలో
పడనివ్వదు .
**అవ్యక్తం వ్యక్తమైతే అది సృష్టి . వ్యక్తం అవ్యక్తమైతే అది లయం .
అందుకే అంతర్ముఖం అవ్వమనేది . ఎందువల్ల ? నీ దిశా మారితే
స్థితి మారుతుంది . నీవు ఎటునుండి ఎటుకి వెళ్ళీనా , స్థితి మాత్రం
ఒకేలా నడిపిస్తుంది . నీ సుఖం ఎటు ఉందొ , అటు నడిడిపిస్తుంది .
కావున అంతార్ముఖ జీవితం లో స్థితి మోక్షం కేసి సాగి బ్రహ్మంలో
లయమౌతాడు .
**యోగులు జీవిత పరమార్ధాన్ని గ్రహించమని చెబుతారు . అంటే
నేను ఎవరు ? ఎక్కడ నుండి వచ్చాను ? ఎక్కడికి వెళుతున్నాను ?
నా గమ్యం ఇదేనా . ఈ నిత్యా విధులు కాదు నా జీవితం . యింకా
ఏదో ఉంది . పుట్టడం బ్రతకడం చావడం కాదు .యింకా ఏదో
తెలుసుకోవలసింది ఉంది . ఉన్నాడనే ఆలోచన జీవిత పరమార్ధాన్ని
చూపుతుంది .
**ముందు మన స్వరూపాన్ని గుర్తిస్తే , యితరులు కూడా నా
స్వరూపాలేనని తెలుస్తోంది . స్వరూపం అఖండ తత్వమని
తెలిస్తే , భిన్నత్వం నశిస్తుంది . అపుడింక వేరుగా దర్శించలేము .
అంతా నేనుగా ఉంటాము .
**ప్రపంచానికి , జీవితానికి చలనం లేలనివాడు పనికి రాడు .
కావున చలనాన్ని చంపుకొని నిశ్చలత్వాన్ని పెంచుకొని ,
జీవునిగా నటించు కొరకు చాలించాలి . నిశ్చలంగా లోపల
జీవించాలి .బాహ్యం లో జీవిస్తే , అంతరంగం లో నీకు యిచ్చిన
సమయం వృధా అవుతుంది .
**స్వరూపం అంటే కేవలం తానె ఉండటం . యిది సరిపోదు .
బురద లో ఉన్న కమలం నేను బురద లో ఉన్నానని తెలుసు
కొన్నంత మాత్రాన సరిపోదు . అచట నుండి దైవ సాన్నిధ్యం చేరే
మార్గం చూపాలి . అట్లే నేను బ్రహ్మ స్వరూపాన్ని అని అంటే
చాలదు . అనంత బ్రహ్మ సాన్నిధ్యాన్ని చేరాలి . అలా జరగాలంటే
నీవు అరూపుడవుడ్ కావలి . అంటే కేవలం స్వరూప స్థితి
మాత్రమే మిగిలి , దేహ సంబంధమైన ఉనికి కొంచెం కూడా
లేకుండా తయారవ్వాలి . అప్పుడే అన్నీ రూపాలలో ఉన్నది
నేనే నాని గుర్తిస్తావు . ఆ అనంత తత్వాన్ని అనుభవిస్తావ్ .
**నామరూపధారునికి స్వరూప శక్తి లేకపోతె , నిరాకారాన్ని
చేరలేడు . నిరాకారునికి నామరూప ధారణ లేకపోతె నిరాకారాన్ని
తెలుపలేడు . కావున రెండు గొప్పవే . రెండు ఒక్కటే . కానీ
మూలం నిరాకారం . అధిపతి నిరాకారం . కావున దాన్ని
చేరుకున్నాక నే సాకారం గొప్పదవుతుంది . రెండు ఒక్కటే నాని
అర్ధమౌతుంది .
**నాకు జ్ఞానం రావాలని భావించే కన్నా , నాలో ఉన్న అజ్ఞానం
పోవాలని భావించడమే మిన్న .
**ప్రపంచం లో తనను తానూ పోల్చుకొని చుస్తే , వాడు జీవుడు .
తనలో ప్రపంచాన్ని చూడగలిగితే వాడు దేవుడు .
**నీవు చెప్పినది జ్ఞానం కాదు . నీవు నడచినదే జ్ఞానం .
**బ్రహ్మమును తెలుసుకొంటే తీను ఉండడు . తనని ఉండనిస్తే
బ్రహ్మం ఉండదు ., తనని తానూ తెలుసుకొంటే , బ్రహ్మమును
తెలుసుకొంటాడు . బ్రహ్మాన్ని గుర్తిస్తే , తన్ని తానూ వదిలేస్తాడు .
**సాకార రూపాలు , నా హృదయం లో ధర్మమనే పీఠం
వేసినపుడు అవి నిలుస్తాయి . నిరాకార బ్రహ్మం నకు ధర్మం
సరిపోదు .తనకై సర్వ ధర్మాలను ఆంతర్యం లో త్యాగించి ,
నీవే నేను అను భావము తో ఖాళీని ఏర్పరచినపుడు ,
నిరాకార బ్రహ్మము స్తిరపడతాడు .
**మనిషి అబద్దపు నేను , బ్రహ్మ నేను కలసిపోయి ఉండి ,
ఆ అబద్దపు నేనునే , సత్య నేనుగా నమ్మి , భ్రమ తో వ్యవహరిస్తూ
ఉంటాడు . బ్రహ్మ జ్ఞానం తో సత్య నేను తెలియబడుతుంది .
సత్య నేను ను అనుభవం గా గుర్తిస్తే తప్ప భావం అబద్దమని
నమ్మడు . భావం అబద్దమని గ్రహిస్తే , బ్రహ్మ యదార్ధం స్థిర
పడుతుంది . భావము , బ్రహ్మము , మధ్య జరిగే యుద్ధం లా
చివరికి నిశ్చల బ్రహ్మమౌనమే సత్యమని అంగీకరిస్తాడు .
నీ భావమే నీకు ఆటంకం తప్ప అన్యం కాదు .
**ధ్యానం అంటే , బలవంతంగా ఆలోచనలను ఆపుతూ , లోపల
ఖాళీని ఉంచుకోవడమని అనుకొంటాము . కానీ ధ్యానమంటే ,
మనం అంతవరకూ చుసిన నామరూపాలు మరచిపోయి ,
సృష్టిని , బ్రహ్మంగా , యింకా వీలయితే , సృష్టి ..దృష్టికి రానంత
ఖాళీగా భవిస్తూ , ఆ ఖాళీ లో నువ్వు ఆసీనుడవై , అందులో
మునిగి ఉన్నట్లు గుర్తించాలి . లోపల ఉన్న ఆలోచనలను
ఎందుకు రానివ్వకూడదంటే , అవి నిన్ను కాల్లీలో కూర్చొన్న
అనుభూతిని పొండనివ్వవు . అదే కాక నీ చుట్టూ , నామ
రూపాలను సృష్టిస్తాయి . కావున లోపల మౌనం వహించి
బయట ఖాళీలో చరించాలి . అదే నీవు ఉండాల్సిన యదార్ధ
స్థితి . కానీ జీవితం కోసం నేత్రాలతో భిన్నంగా చూడవలసి
వస్తుంది . జన్మ రాహిత్యం కోసం నేత్రాలు మూసి ,అభిన్నత్వాన్ని
దర్శించి , అందులో మునిగి ఉన్నందువల్ల సత్య మెరిగిన
వానిని భిన్నత్వం బంధించదు .
**తనని తాను గుర్తించుకొని చేసే కర్మ బంధించదు . తనను
మరచి చేసినది బంధించును . అనగా కర్మ ఫలితము ఏదైనా
గానీ , అనుభవించాలి . అనుభవించుటకొరకు జన్మనెత్తాలి .
స్వరూప ఎరుకే మోక్షం .
**మనస్సును మౌనంగా ఉంచుకోవడమే మన లక్ష్యం .
మనోమౌనం మనస్సును అట్నార్ముఖం చేసి బ్రహ్మం నందు
లయమయినపుడు వస్తుంది .
**అంతఃకరణ శుద్ధంగా ఉన్నపుడే మనో మౌనం వస్తుంది .
మనస్సు సిద్ధం అయి బ్రహ్మంగా ఉన్నపుడు జన్మ లేదు .
బ్రహ్మమే మౌనము . చిద్విలాసంగా చిదాత్మగా ఉండాలి .
**నేను అనంతమైన బ్రహ్మమును . నేను మీలో ఉన్నాను .
దేహ నేను ను తొలగిస్తే , నేను గోచరిస్తాను . నేను విస్తరించే
ఉన్నాను . నా విస్తీర్ణతని ఎవరు గ్రహింతురో , వారిని నేను
నడిపించెదను . మీలో గల నేను తొలగాలంటే , నేను
బ్రహ్మమును అని ధ్యానిస్తూ మౌనంగా ఉండాలి .
**చలనం ఆలోచనలకు బలం . మౌనం ఆలోచనల యొక్క
మరణం . ఆ మరణం లో నే మీ అమరత్వం దాగి ఉన్నది .
ఆ స్థితి నేను ఐ ఉన్నాను . ఆ స్థితే మోక్షం ఐ ఉన్నది .
**దేహభావం తో ఉన్నదంతా పరిమిత తత్త్వం . ఈ పరిమి
తత్త్వం అపరిమిత తత్వాన్ని మూసివేసినది . నేను , నాది లో
బంధించి వేసినది . బ్రహ్మ భావం తో , బందిఖానా ని
తెంచుకొని , హృదయ విశాల తత్వాన్ని పెంచుకోవాలి .
నేను నాది తొలగినపుడు , ఉన్నది విశాల తత్వమే .
అదే బ్రహ్మయే స్థితి .
**అన్నీ చేస్తున్నాను , దేని యందు చిక్కక ఉండువాడు అకర్త .
అకర్త గా ఉండుటకు అభాసించుట ఏ బ్రహ్మ జ్ఞానము .
మనస్సులో భావం రాకుండా జీవితం నడవదు . భవం వస్తే ,
మోక్షం రాదు . ఈ మధ్యన రెండింటినీ సాధించుకొనేదే బ్రహ్మవిద్య .
**భావమే జీఇతణ్ణి నడిపిస్తుంది . ఆ భావాన్ని బ్రహ్మమే
నటింపజేస్తున్నదని గుర్తించి , ఆంతర్యం లో ప్రతీ క్షణం కర్త్రుత్వం
నుండి తప్పుకోగలగాలి . అదే భావాతీత స్థితి . అదే సాక్షిత్వమ్ .
అదే ఆకర్త్రుత్వం . భావం బంధం అవుతుంది కాబట్టి భావాన్ని
సాక్షిగా చూడాలి .
**బ్రహ్మార్పణం .
No comments:
Post a Comment