Saturday, November 28, 2020

అయ్యప్ప

ఎన్ని జన్మల తపమో...
ఎన్నిజన్మల పుణ్య పలమో...
ఇరుముడు ఎత్తుకొని నిన్ను చేరి నీ దర్శన కోసం ఎదురు చూసిన నా జన్మ ధన్యము కదా మణికంఠ...

హరిహర పుత్ర అయ్యప్ప శరణు...

శివోహం

శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ
నీ నామము నా పదమున దీపిక కానీ
నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ
మహేశా.....శరణు.

శ్రీరామ

కార్యసాధకుడు కపీశ్వరుడు...

సుందరకాండ పారాయణ చేస్తే ఆగిపోయిన పనులు కూడా అయిపోతాయని లోకంలో ప్రతీతి. అలా చెప్పడంలో పెద్దల ఉద్దేశ్యం కేవలం పారాయణ చేసినంతలో ఏదో హనుమచ్చక్తి కిందికి దిగి వచ్చి మన పనులన్నీ చేసి పెట్టేస్తుందని కాదు. సుందరకాండ మొత్తం సావకాశంగా, సావధానంగా చదివితే..  కార్యసాధనలో ఎదురయ్యే ఆటంకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో, వాటిని ఏ రకంగా తొలగించుకోవాలో అవగాహన చేసుకొంటారని పెద్దల ఉద్దేశం. ఏ విషయాన్నైనా అవగాహన చేసుకొని వాటిని మన జీవితానికి అన్వయం చేసుకొని ఆచరణలో పెడితే కాని పని ఉంటుందా? హనుమంతుడు సముద్రలంఘనం చేస్తుంటే మూడు రకాల ఆటంకాలేర్పడ్డాయి. మైనాక పర్వతం మర్యాద చేయడానికి అడ్డంగా వచ్చి నిలబడింది.

ఇది సాత్త్వికాటంకం. తర్వాత సురస అనే రాక్షసి ఆకాశమార్గానికి అడ్డంగా వచ్చి.. తన నోట్లో ప్రవేశించకుండా ఏ ప్రాణీ ముందుకు వెళ్లలేదని పంతం పట్టింది. ఇది రాజసాటంకం. ఆ తర్వాత సింహిక అనే ఛాయాగ్రాహిణి మాటామంతీ లేకుండా కిందికి లాగెయ్యడం మొదలుపెట్టింది. ఇది తామసాటంకం. కార్యసాధకుడైన హనుమంతుడు మూడు ఆటంకాలనీ మూడు రకాలుగా ఎదుర్కొన్నాడు. మైనాకుడు మర్యాదలు చెయ్యడం కోసం అడ్డుపడ్డాడు కాబట్టి.. అతనితో మర్యాదగానే మాట్లాడి, తిరిగివచ్చేటప్పుడు ఆగుతానని చెప్పి దాటి వెళ్లిపోయాడు. సురస ఆంజనేయుణ్ణి మింగేద్దామని నోరుతెరిచింది.

స్వామి దాంతో పోటీపడి దానికి రెట్టింపు స్థాయిలో శరీరం పెంచాడు. కొంతసేపయ్యాక సమయం వృథా అవుతోందని గమనించి.. అతి సూక్ష్మ శరీరంతో దాంట్లోంచి బయటపడ్డాడు. రాజసాటంకాల నుండి బయటపడే ఉపాయం అది. ఆ తర్వాత సింహిక.. ఆంజనేయుడి నీడ పట్టుకొని బలవంతంగా కిందికి లాగేస్తుంటే అది తమోగుణ ప్రవృత్తి అని గ్రహించి.. తన బలమంతా ఉపయోగించి దాన్ని పైకిలాగి ఒక్క గుద్దుతో పైలోకాలకి పంపేశాడు. అంటే తమో గుణానికి దండనతో బదులు చెప్పాడన్నమాట. అలామనం కూడా ఏదైనా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకొన్నప్పుడు ఎదురయ్యే ఆటంకాలు ఏ రకమైనవో గమనించుకొని ఆ రకమైన ప్రవృత్తితోనే వాటిని ఎదుర్కోవాలి. కొన్నింటిని మర్యాదగానే ప్రక్కకి తొలగించాలి. మరికొన్ని విషయాల్లో కొంతసేపు పోటీపడినా.. సూక్ష్మమైన ఉపాయాలను ఆలోచించి, ఆ పోటీ నుండి బయటపడి మన పని మనం చేసుకోవాలి. తీవ్రవాదం వంటి సమస్యలను అంతే తీవ్రంగా ఎదుర్కొని ఉక్కుపాదంతో అణచివేయాలి. అక్కడ మెతకదనం పనికిరాదు.

ఒక్క వ్యక్తి జీవితానికైనా, మొత్తం వ్యవస్థలో మార్పులకైనా ఈ త్రిగుణాత్మక వ్యూహం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ రకంగా సుందరకాండలో ఘట్టాల్ని అవగాహన చేసుకొని, మన జీవితానికి అన్వయించుకుని ఆచరణలో పెడితే కాని పని అంటూ ఉంటుందా? అందుకోసం సుందరకాండ అందరూ చదవాలి. కపీశ్వరుని కార్యసాధకత్వాన్ని అవగాహన చేసుకొని అనుసరించాలి.
సేకరణ: ఆంధ్రజ్యోతి

శివోహం

మనకు అన్నీ భగవంతుడే ఇస్తే
ఆయనకు మనమేమి ఇవ్వగలం
అలాగని ఏమీ ఇవ్వకుండా ఉంటే
కృతజ్ఞత అవుతుంది కదా !
తల్లిదండ్రులు మనకు ఎన్నో ఇచ్చారు
మనం అనుభవిస్తున్న జీవితం
వారు అనుగ్రహించిందే
ఇంక వారికేమి ఇవ్వగలం
అలాగని వదిలేయలేం కదా !
వారియెడల భక్తిని కలిగి ఉండాలి
మనం ఏ చిన్న సేవ చేసినా
మురిసిపోతారు తల్లిదండ్రులు
భగవంతుడుకూడ అటువంటి
అల్పసంతోషియే ఏ కొంచెమిచ్చినా
పరమానంద పడిపోతాడు
అటువంటిది మననే కానుకగా
సమర్పిస్తే ఎంత మురిసిపోతాడు
అంటే బ్రహ్మస్మి అనే భావంతో
నీవే నేననుకో అనే భావాన్ని
వ్యక్తం చేయడమే నిజమైన కానుక

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివ నీ భక్తియే ముక్తికి మార్గము...

మంచీ చెడ్డా,పాప పుణ్యా,భారమిక 
నీదే కదా తండ్రి...

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, November 27, 2020

శివోహం

శివా!గమ్మత్తుగ మత్తు ఆవరించింది
కనులు మూత పడుతున్నాయి 
నీ కోసం వెతుకుతున్నాయి
మహేశా ..... శరణు.

Thursday, November 26, 2020

శివోహం

కన్న వారినీ కన్న భూమినీ...
ఎదో ఓ రోజు శుభ ముహూర్తం పెట్టి...
నువ్వు దూరం  చేస్తావని తెలిసి కూడా...
ఏరికోరి నిన్నే ఎంచుకున్న శంభో.
ఎందుకంటే చిట్టచివరికి నువ్వే తోడుంటావని...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...