Friday, March 19, 2021

శివోహం

ఆనందం ఆనందం ఆనందం ఎక్కడ దొరుకుతుంది ఈ ఆనందం...
అసలైన ఆనందం కేవలం నిర్వికల్ప సమాధి లోనే తప్ప మరెక్కడా లేదు...
దొరకదు కూడా ఆలోచించండి...   

 *ఓం నమః శివాయ*

శివోహం

అమ్మా భవానీ... 
మాతా మహేశ్వరి
దుర్గ భవాని 
చండి నారాయణి నమో నమః. 
ఓం మాతా శక్తి స్వరూపిణి
లోకమాత జగజ్జనని రక్షమామ్...

శివోహం

లోకం ఇచ్చే ఆనందం కొంతకాలమే ఉంటుంది...

శాశ్వత ఆనందం శివయ్య సేవలోనే ఉంటుంది...

ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నీ ముందు అఖండ జ్యోతిలా  
వెలిగి పోయే మధుర క్షణాల కోసమే
నా ఎదురు చూపులని ప్రత్యేకంగా చెప్పాలా శివ...

మహాదేవా శంభో శరణు...

ఆధ్యాత్మిక చింతన

ఆధ్యాత్మిక చింతన

భగవంతుడు కనపడుటలేదని మానవులు బాధపడుచున్నారు. భగవంతుడు ఉన్నాడా లేడా ! ఉంటే తప్పక కనబడాలి కదా అని విచారణ చేయుచున్నారు. ఇందుకు కలడు అందురు, ఎందెందు వెదకిచూచిన అందందే కలడని పెద్దలు చెప్పుచుందురు. కలడు కలండనెడివాడు కలడోలేదో యను అనుమానము వలన మానవులకు మనమున కలత చెంది యుండుట తెలియచునేయున్నది. ప్రతి నిత్యం మనం సూర్యుడిని చూస్తున్నాం.

 
సూర్యునికి మనకు మధ్య ఆకాశమున మేఘము ఏర్పడినప్పుడు మనం సూర్యుడిని చూడలేకపోతి మిగదా అప్పుడువాయువు వచ్చి ఆ మేఘాలను పక్కకు నెట్టివేయుచున్నది. అప్పుడు సూర్యదర్శనం చేయుగలుగుచున్నాం.

ఈ విషయం అందరికి తెలిసినదే. మనకు భగవంతునికి మధ్య అజ్ఞానం ఆవహించబడడం వలన భగవంతుడు మనకు కనబడడం లేదని శాస్త్రం చెప్పుచున్నది. ఈ అజ్ఞానమును జ్ఞానం వలన తొలగినప్పుడు భగవంతుని దర్శనం సిద్ధించునని శాస్త్రం చెప్పుచున్నది.

సూర్యుడు ప్రాతఃకాలమున ఉదయించిన చీకటి కనుమరుగుకాగలదు. అలాగే జ్ఞానం మానవులందు వికసించిన అజ్ఞానం ఇక యుండదు. ఈ ధరణిపై సమస్త ప్రాణికోటి జన్మించి జీవించుచున్నవి. మానవులు కూడ ఈ ప్రాణికోటి యందు ఒక భాగమే వీరును జీవించుచున్నారు.

ప్రాణులకు బుద్ధికోశం లేదు. మానవులకు మాత్రమే బుద్ధికోశం కలదు. మానవులు బుద్దికోశంతో జ్ఞాన వంతులుగాయున్నారు. ఇట్టి మానవులకు అజ్ఞానం ఎలా సంభవించినదని వాపోవుఞచున్నారు. ఈ ప్రకృతి ఈ విధంగా జనించుటకు మూలాధారంగా త్రిగుణములు కారణం.

త్రిగుణములు ప్రకృతి యందు ఉన్నందు వలన ప్రాణులు ప్రకృతి అంశములే కావున త్రిగుణములు మానవ్ఞలందు కలవ్ఞ. కావ్ఞన ఇష్టం అయిష్టం ఇష్టాఇష్టం అను భావన మరియు అహంకారం, స్వార్థం, ఏర్పడినది కావ్ఞన అజ్ఞానమనగా ఇట్టిస్థితి యండుంట యని శాస్త్రం చెప్పుచున్నది.

మానవులు బుద్ధితో ఆలోచించి కర్మలు ఆచరించిన కలుగు ఫలం అనుభవించవలయునుగదా ఇట్టి స్థితి ధర్మసమ్మతం. కర్మలు అహంకారంతో ఆచరించుట కలిగిన ఫలం స్వార్థపరంగా అనుభవించుట, కర్మలకు దాసోహం వలన ఇష్టం అయిష్టం, ఇష్టా ఇష్టం కలిగి యున్నప్పుడు మమకారముచే బంధంగావింప బడియుండుటయే అజ్ఞానం.

ఈ అజ్ఞానం వలన సత్యపదార్థం భగవంతుడు కనబడుటలేదని శాస్త్రం చెప్పుచున్నది. భగవంతునికి పుట్టుకలేదు. రూపం లేదు. నామంలేదు. ఆయన ఎచటయున్నాడో స్థావరం తెలియుట లేదు. భగవంతుడిని దర్శించాలి యని తపన మానవులందు కలుగుచున్నది. భగవంతుని నివాస స్థలం కనుగొనాలంటే జ్ఞానంచే తెలుసుకొనగలం ఇది సత్యం.

వార్త పత్రిక నుండి సేకరణ

Thursday, March 18, 2021

శివోహం

పంచాక్షరీ మంత్రాధి దేవుడవు
కొండంత నీవున్నా...
పంచ భూతాల చిరు అంశలలో
దేనితోనైనా నిన్ను పూజించగానే
పులకరించిపోయి మాకు అభయమునిచ్చే దయామూర్తివి దక్షిణామూర్తీ నువ్వే తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ఆధ్యాత్మిక అనుభవం...

నీ జీవిత పరమావధి  ఏమిటో తెలుసుకో
ఈ జీవితం, సృష్టి ,వీటిలో  ఉన్న నిగూఢ రహస్యాలను తెలుసుకో.
స్వేఛానుభూతి ని పొందు, నీ అంతరంగ లోతుల్ని వెతుకు. వికాస మార్గం లో అతి సున్నితమైన మార్గదర్శక అడుగులు వేస్తూ మున్డుకెళ్ళు.
ప్రగాఢ సత్యాన్ని, అత్యుత్తమమైన జ్ఞానాన్ని, అసాధారణమైన ఆనందాన్ని గురువుయొక్క సమక్షం లో ఆస్వాదించు.
ఆధ్యాత్మిక మార్గం లోనున్న చిత్రం  ఏమిటి అంటే అందరి అనుభవాలు నిర్దిష్ట మైనవే అయినా వర్ణనకు అతీతం .అంటే మాటలలో చెప్పలేము.
అంచెలంచెలు గా అపూర్వ పయనము
నీ శరీరాన్ని, మనస్సుని  ,నీ ప్రాణాన్ని కుదుట పరిచి సంయమనము లో ఉంచాలి.
దీనిలో మొట్టమొదట అడుగు సుదర్శన క్రియ నేర్చుకోవడం క్రియలోని శక్తివంతమైన శ్వాస ప్రక్రియ ,మన శరీరాన్ని ,మనస్సుని ,ప్రాణాన్ని శుద్ధపరచడమే కాకుండా వాటి మధ్య సంయమనాన్ని తీసుకొస్తుంది.

దీని వల్ల పేరుకుపోయిన వత్తిడిని సహజబద్ధంగాను ,నిర్దిష్టంగాను తొలగిస్తుంది

నీ అంతరాత్మలో ని అనంత సహజ స్వరూపంలో నిమగ్నం అయిపో.
మౌనవ్రతం:- అంటే సహజసిద్ధంగా మనో సంయమనంతో మన శక్తిని ,ధ్యాసని బాహ్య ప్రతిబంధకాల  నుంచి మళ్ళించుకోవడం.
ఈ ప్రక్రియను అనాది గా వివిధ సాంప్రదాయాలలో ,శారీరక ,మానసిక, ఆధ్యాత్మిక పునరుజ్జీవానికి వాడుతూనే ఉన్నారు.
AOL programs లో పాల్గొనడం వల్ల వాటిలోని నిర్ణీతమైన, ప్రభావపూరితమైన పద్ధతులు మన ప్రాపంచిక ఆలోచనయంత్రాంగ(mind) పరిధులు దాటి అలౌకికమైన  ప్రశాంతత ,ఉత్తేజితమైన ప్రాణ శక్తి  (vitality) మనకు సమకూరుతాయి. మన నిత్య జీవితంలో మనకు బాగా తోడ్పడుతాయి కూడా.

అంతరాంతర ఆత్మశోధన/సుధీర్ఘ అంతర్మథనం
దీనికి ఒక అనుభవజ్ఞడైన గురువు దగ్గర మంత్ర దీక్ష ఇవ్వబడుతుంది.
సహజ సమాధి ధ్యానము:-ఈ ప్రక్రియలో ఇవ్వబడిన ఓ సాధారణ మైన శబ్దాన్ని ఆసరాగా తీసుకొని మనస్సుని స్థిర పరుచుకుంటారు, అంతర్ముఖులు అవుతారు. దీనితో  మన మనస్సు ,నాడీ వ్యవస్థ గాఢ నిస్సబ్ది లో చిన్న చిన్నగా విలీనం అయి ,మన పురోగతికి ఉన్నఅడ్డంకులు ఒక్కటోక్కటి గా తొలగిపోతాయి.ఈ సుదర్శన క్రియ యొక్క  నిరంతర అభ్యాసం వల్ల మన నిత్య జీవినవిధానం గణనీయంగా మెరుగు పడి,విశాల దృక్పదం, ప్రశాంతత ,ప్రాణ శక్తులను సంతరించుకుంటాయి.

ఆర్తులకు స్వాంతన ఇచ్చే ఆశీర్వాద ప్రక్రియ
సమృద్ధి,సంతుష్టి, ఆశయ సాకారతలను అందించే ఆశీర్వాద ప్రక్రియ మనకు నిత్య నూతన ఉత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమం.
ఆశయ సాకారత(fulfillment) తో మన చైతన్యానికి ఒక అవ్యానుభుతి, దివ్యానుభూతి. దీనిని నేర్చిన వారు చికిత్స రూపంగా జనాళి కి బహు ఉపయుక్తముగా ఉండగలరు.ఆ విధంగా ఇరులకు(both the healer and the healed) సంతోషాతిశయాలు ,సంతృప్తి కలుగుతాయి. పరులకు సేవ చేయడానికి ఇది ఒక మహాదావకాసం ,ప్రస్తుత సమాజములో చాల అవసరము కూడా.
ఎంతోమందికి  ఈ చికిత్స(healing by blessing) వల్ల అలౌకిక స్వాంతన లభించిన నిదర్శనాలు ఉన్నాయి. ఇది సేవా తృష్ణాతులకు గొప్ప అవకాశం.

Source: సేకరణ

కృతజ్ఞత లో తరింపు:-
నిబద్ధత తో అర్పించిన  నిర్మల పరిపూర్ణ హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనములు పరిపక్వ చైతన్యానికి నిదర్శనం .దీనికుద్దేసించిన మహత్తర ప్రక్రియ “గురుపూజ”.మన పవిత్ర సనాతన సాంప్రదాయంలో ఇదొక ప్రత్యేకత సంతరించుకున్న గొప్ప  కార్యక్రమం. అనాది గా వస్తున్నా జ్ఞాన జ్యోతి ని అందిస్తూ వస్తున్న గురుపరంపరకు ఈ గురుపూజ, చంద్రుడికొ నూలుపోగు లాంటిది.నీటిబిందువు చిన్నదైనా సముద్రములో కలిసినప్పుడది  సముద్రపు స్థాయిని అనుభవించినట్లే మనం కూడా ఈ సనాతన గురువుల సాంప్రదాయానికి అనుసంధానమయితే అనంత శక్తివంతులుగా అనుభూతిచెందుతాంకదా!

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...