Tuesday, March 23, 2021

స్వామి శరణం

అయ్యప్పను జూడని కన్నులు కన్నులే కాదు...
కంఠం లో మెరిసే నవరత్న మణి హారాలతో...
చెవులకు కుండలాలతో....
తెల్లని పలువరస తో దగ దగా మెరిసే...
అయ్యప్పను జూడని కన్నులు కన్నులే కాదు...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

అమ్మ

అజ్ఞాన అంధ వినాశ కారిణి
మమ్ము ఆదరింపు మాత...
కలిగున్నవారి లోగిలిలో నీవు వున్నావు...
ఈ కలిలోన ఆకలితో మేము వున్నాము...
కలకాలం మా కొరతలు తీర్చవేమమ్మ...
ఈ కలియుగ మానవునికి మోక్షమియమ్మ...

అమ్మ దుర్గమ్మ శరణు...
ఓం శ్రీ దుర్గాదేవినే నమః

ఓం గం గణపతియే నమః

సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం

ఓం గం గణపతియే నమః

శివోహం

మొదటి ఒడి చేసుకున్న ఋణం...
రెండవ ఒడి తీర్చుకున్న ఋణం...

రెండు ఋణాల జమాఖర్చుల మధ్య నను నడిపే నాధుడు నా శివుడు...

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, March 22, 2021

శివోహం

కారణములు లేక కార్యాలు జరుగవు.
భగవంతుడు ఏది చేసినా అందులో మంచే తప్ప చెడు ఏమీ ఉండదు. రైతు పంట చేనుకు మందు జల్లేటపుడు చీడ పురుగులు చస్తాయే తప్ప పంట మెుక్కలకు ఏమీ కాదు. భగవంతుని వాక్యములు పెడచెవిన పెట్టి గర్వోన్మత్తులై దయ దాక్షిణ్యాలు లేక హింసకు పాల్పడే చీడ పురుగులన్నీ రాలిపోవాలనే ఈ వినాశనం. భగవంతుని యందు భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నవారు భయపడవలసిన పని లేదు. భగవంతుని నామ స్మరణ చేసుకొండి. వ్యక్తి ప్రయత్నముగా పరిశుభ్రత పాఠించండి. మానవుడు చేసుకున్న మహా తప్పిదమే ఈ వినాశనం తప్ప దీనికి భగవంతుని బాధ్యుతుని చేయడం వెర్రితనం. కనీసం ఈ వినాశనం చూసైనా మనుషులలో మార్పు రావాలి. గుణపాఠం నేర్చుకోవాలి. జీవులను హింసించడం మానుకోవాలి. లేదంటే ఇంతకంటే పెద్ద వినాశనం తప్పదు.

Sunday, March 21, 2021

శివోహం

శివ, సదాశివ, ప్రాణనాధ
నిను అర్థం చేసుకునే దారి వెదకడం అంటే...
నన్ను నేను తెలుసుకోవడం...
ఆరెండు అర్థం అయ్యే స్థితిలో నను
చేర్చుకో పరమేశ్వరా...
నామనమున నీవు నిలిచిపో...
ఓం నమః శివాయ

Saturday, March 20, 2021

శివోహం

ఓం గణేశాయ నమః

వినాయకుడి ఆరాధనతొనే లక్ష్మీ దేవి నిలిచి ఉంటుంది.లక్ష్మీ దేవికి చంచల అని పేరు."ఓం చంచలాయై నమః".అంటే ఒకే చోట ఎక్కువసేపు ఉండనిది.లక్ష్మీ దేవి ఎప్పుడు స్థిరంగా ఉండదు.మరి గణపతో?గణపతి ఒకసారి సాధారణంగా ఎక్కడైనా కూర్చుంటే కదలడు.ఆయన స్థిరంగా కూర్చుంటాడు.

లక్ష్మీ దేవిని,గణపతిని కలిపి ఆరాధించాలి.కలిపి ఆరాధించేవారి ఇంటి నుంది లక్ష్మి దేవి తాను వెళ్ళిపోతాను అంటే వినాయకుడు కాసేపు కూర్చొవమ్మా అంటూ ఆమేను ఆ ప్రదేశంలో స్థిరంగా ఉంచుతాడట.అందువల్ల కేవలం లక్ష్మి దేవినే కాదు,ఆమేతో పాటు వినాయకుడిని ఆరాధించాలి.

వ్యాపార కేంద్రాల్లోను,ఇంట్లోను లక్ష్మి దేవి ఫొటో ప్రక్కన వినాయకుడి ఫొటొ ఉంచి రోజు ముందు స్వామిని పూజించాక లక్ష్మిదేవిని పూజించండి.ధనం నిలుస్తుంది.

ఓం గణేశాయ నమః

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...