Monday, March 22, 2021

శివోహం

కారణములు లేక కార్యాలు జరుగవు.
భగవంతుడు ఏది చేసినా అందులో మంచే తప్ప చెడు ఏమీ ఉండదు. రైతు పంట చేనుకు మందు జల్లేటపుడు చీడ పురుగులు చస్తాయే తప్ప పంట మెుక్కలకు ఏమీ కాదు. భగవంతుని వాక్యములు పెడచెవిన పెట్టి గర్వోన్మత్తులై దయ దాక్షిణ్యాలు లేక హింసకు పాల్పడే చీడ పురుగులన్నీ రాలిపోవాలనే ఈ వినాశనం. భగవంతుని యందు భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నవారు భయపడవలసిన పని లేదు. భగవంతుని నామ స్మరణ చేసుకొండి. వ్యక్తి ప్రయత్నముగా పరిశుభ్రత పాఠించండి. మానవుడు చేసుకున్న మహా తప్పిదమే ఈ వినాశనం తప్ప దీనికి భగవంతుని బాధ్యుతుని చేయడం వెర్రితనం. కనీసం ఈ వినాశనం చూసైనా మనుషులలో మార్పు రావాలి. గుణపాఠం నేర్చుకోవాలి. జీవులను హింసించడం మానుకోవాలి. లేదంటే ఇంతకంటే పెద్ద వినాశనం తప్పదు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...