Saturday, May 21, 2022

శివోహం

నారసింహ స్వామీ...
నీ సాక్షాత్కారము సకల పాప హరణం...
నీ దర్శనం భవరోగ నివారణం...
నీ స్మరణం పూజనం ,సేవనం , జన్మ జన్మల పుణ్యఫలం...
శ్రీమన్నారాయణ భయంకర మహోగ్ర లక్ష్మీ నరసింహ నీవే శరణు.

శివోహం

జీవితమంటేనే సుఖదుఃఖాల సంగమం....
బంధాలు అనుబంధాలు, ఆత్మీయతలు, ఆనందకర అనుభూతులతో పాటు...
ఎన్నెన్నో అవరోధాలు, అవహేళనలు, ఆవేదనలతో కూడిన ప్రయాణమే జీవితం....
అందరి జీవితగమనంలో ఎత్తుపల్లాలు సహజం.... వాటినుంచి పాఠాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం చేరుకోగలం...

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, May 20, 2022

శివోహం

కర్మానుసారముగా నడుస్తూ నా మదిలోని 
తలపులను...
కష్టాలను నీతో చెప్పుకుంటున్నాను..
కనుపాపగా నీవే నా చెంత ఉండి నా గమ్యం ఏమిటో తెలియపరుస్తున్నావు...
తండ్రి నీవు కృపసాగారుడిని...

ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా.

శివోహం

మట్టితో బొమ్మను చేసి...
మనిషిగా ప్రాణకు పోసి...
బంధానికి బంది చేసి...
అనుబంధానికి నిచ్చేన వేసి..
అనుక్షణమూ ప్రేమను పెంచి..
సకలము,సర్వమూ శాశ్వతం అనే మాయను
పెంచి...
ఈ మాయ అనే ప్రాణం తీసి....
ఎన్ని ఆటలు ఆడిస్తున్నావయ్యా శివయ్యా..
ఈ జీవుడుని ఇన్ని ఆటలు ఆడిస్తూ ఏమి తెలియని అమాయకునిలా ఎట్టా  కూర్చునావయ్యా...
నీకు నీవే సాటి వెరెవ్వరయ్యా...

మహాదేవా శంభో శరణు...

Thursday, May 19, 2022

శివోహం

దైవభక్తితో ప్రపంచాన్ని మరచిపోవలి...
అంతేగానీ...
ప్రపంచాన్ని చూస్తూ దైవభక్తిని మరచిపోకూడదు...
మనం ప్రపంచంలో ఉండాలి కానీ మనలో ప్రపంచంలో ఉండకూడదు...
పడవ నీళ్లలో ఉండాలి కానీ పడవలో నిల్లుండకూడదు...
జ్ఞాని తాను చేసింది, చేయనిది, చేయవలసింది వాటి గురించి చితించడు...
అంటే జ్ఞాని తాను చేసే కర్మకు తాను కర్తను అని గాని, చెయ్యని దానికి అకర్తను అనిగాని  భావించడు....
కర్మలో అకర్మగా ఉంటాడు..
అకర్మలో కర్మగా ఉంటాడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

జీవుడు(మనం) ఎప్పటికి ఒంటరివాడే ! 
 జాృగృ,స్వప్నాతావత్సలో వుండేంతవరకే వాడు అఙ్ఞానంతో తోడుకోసం తపిస్తాడు.సుసుక్తావత్సలో వాడి ఉనాకే కోల్పోతాడు అప్పుడు వాడి కళల(కల్పనల) సామ్రాజ్యానికి వాడే కర్త(బ్రహ్మ) కర్మ(విష్ణు)  లయ(రుద్రుడు)
వాడికి అన్యంగా కించిత్ కూడ ఉండదు.ఆవిషయాన్ని జాగృత్ లో ఉన్నప్పుడు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే  మానవుడు మాధవుడౌతాడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

జీవుడు(మనం) ఎప్పటికి ఒంటరివాడే ! 
 జాృగృ,స్వప్నాతావత్సలో వుండేంతవరకే వాడు అఙ్ఞానంతో తోడుకోసం తపిస్తాడు.సుసుక్తావత్సలో వాడి ఉనాకే కోల్పోతాడు అప్పుడు వాడి కళల(కల్పనల) సామ్రాజ్యానికి వాడే కర్త(బ్రహ్మ) కర్మ(విష్ణు)  లయ(రుద్రుడు)
వాడికి అన్యంగా కించిత్ కూడ ఉండదు.ఆవిషయాన్ని జాగృత్ లో ఉన్నప్పుడు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే  మానవుడు మాధవుడౌతాడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

నీ చిరునవ్వుల చిరుజల్లులు నా పై కురిపించి వెళ్ళు.... అరుణాచల