Wednesday, July 15, 2020

ఓం

భగవత్ స్మరణ

మీరు ఉదయముననే ఒకసారి భగవంతుడితో చెయ్యి కలపండి. ఒకసారి అయనను స్మరించండి. అప్పుడు ఇక చూడండి మీకు ఆఫీసులో మీ పని పాడవదు. మీకు ఏ విధమైన నష్టం జరుగదు. ఒకసారి మంగళకరమయిన భగవంతుని స్మరించుకో. మీరు "శ్రీకృష్ణ శరణం" అంటారో, "శ్రీరామ శరణం" అంటారో, "ఓం నమో నారాయణాయ" అంటారో, "ఓం నమశ్శివాయ" అంటారో, "స్వామియే శరణం అయ్యప్ప" అంటారో ,  ఎమీ అభ్యంతరం లేదు. ఉదయం లేవగానే మాత్రం ఒకసారి ఆ పవిత్రాతి పవిత్రమైన స్మరణ జరిగి పోవాలి. ఒక శ్లోకమైనా సరే, శ్లోకపాదమైనా సరే చెప్పండి. అది రోజంతా మీ మనస్సులో వుండి పోతుంది. ఉదయాన్నే మొట్టమొదట మనం ఏది చెబుతామో అది మనం మరచిపోము. మనము సంస్కారానికి దూరం కాము.  "శ్రీ రామ రామ  రామేతి, రమే రామే మనోరమే, సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే"  "శ్రీరామ , శ్రీరామ, శ్రీరామ"  అది మీ మెదడులో రోజంతా ఉంటుంది.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...