సిత్రాలు సేసేడు నిత్యగంగాధరుడు
పంచభూతాలలో ఎప్పుడూ సేదతీరుతూనే ఉంటాడు...
ఉన్నోడయినా లేనోడయినా చివరకు చేరేది ఆయన పాదాల చెంతకే...
అందుకే ఉన్నన్నాళ్ళు పంచాక్షరీ మంత్రంతో ఓం నమః శివాయ అని జపించండి అవ్యయ మోక్షము పొందండి...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...
No comments:
Post a Comment