Wednesday, May 18, 2022

శివోహం

చెట్టు మీదకి పక్షి వచ్చి వాలితే ఆ  పళ్ళని తిని గూడు కట్టుకుని పిల్లల్ని కనీ అవి పెరిగి పెద్దవై రెక్కలొస్తే
గూటిని వదిలి వెళ్ళిపోతాయి.
అంతే  కానీ పిల్లల కోసం ఎదురు చూడదు.
పక్షి ఇంకో చెట్టు మీదకి వెళుతుంది.
జీవుడు కూడా ఎదో  ఒక  దేహంలోకి
వస్తాడు కర్మ ఫలాలను అనుభవిస్తాడు.
ఋణాను బంధ రూపేణా ధారా పుత్రులు వస్తారు ఋణం తీరిపోగానే వెళ్ళిపోతారు
కానీ మనుషులు  బాధపడుతుంటారు అయ్యో వెళ్లిపోయావా అని ఇదంతా కంచి గరుడ సేవ.
విత్తనాన్ని కాలిస్తే మొలవదు...
మనస్సుని జ్ఞానంతో అభ్యాస వైరాగ్యాలతో కాలిస్తే జన్మ ఉండదు.

ఓం శివోహం... సర్వం శివమయం.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...