Tuesday, March 14, 2023

మౌనం మహోన్నతం


 మౌనం అత్యంత పాటవమైన పని. వేదవేదాంతాలు సత్యాన్ని గురించి ఎంతో వర్ణిస్తాయి, ఘోషిస్తాయి. చివరికి ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అని శాంతించి మౌనాన్ని వహిస్తాయి. అప్పుడు అసలు వర్ణన మొదలవుతుంది. సత్య గురువు మౌనంగా, స్వరూపంగా ఉంటాడు

ఎక్కడలేని శాస్ర్తాల, గ్రంథాల సారమంతా సద్గురువు మౌనానికి సాటిరావు. గురువు మౌనం, నిశ్చలత ఎంతో విశాలం, విస్తారం! మౌనం శక్తిపూర్ణమైనది. అది అందరి హృదయాలనూ పరివర్తనం చేస్తుంది. అజ్ఞాని తన ఆత్మను శరీరంగా భావించి, అలాగే ఇంకో శరీరాన్ని గురువు అనుకుంటాడు. కానీ, గురువు తాను దేహమని భావిస్తాడా? ఆయన శరీరానికి అతీతుడు. ఆయనకు భేదాలేం ఉండవు. ఆయన మౌనమే మహోన్నత ఉపదేశం.

– భగవాన్‌ రమణ మహర్షి

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...