Thursday, January 4, 2024

శివోహం

నాదస్వరం వినిపిస్తే పుట్టలోని పాములన్నీ బయటికి వచ్చినట్లుగా, మీరు నామస్మరణ చేస్తే మీ హృదయంలోని దుర్గుణాలన్నీ తొలగిపోతాయి. నామస్మరణ చాలా పవిత్రమైనది. ఈనాడు నామస్మరణ తగ్గిపోవడం చేతనే దేశంలో బాధలు పెరిగిపోతున్నాయి. వీధివీధి యందు నామ సంకీర్తన చేయండి. శరీరంలోని అణువణువునూ, కణకణమునూ భగవన్నామంతో నింపుకోండి. నామస్మరణ వలన కలిగే ఆనందము, ధైర్యసాహసాలు ఇంక దేనివల్లనూ లభించవు. ఇతరులేమనుకున్నా ఫరవాలేదు, అపహాస్యం చేసినా పట్టించుకోనక్కర్లేదు. దృఢమైన విశ్వాసంతో నామస్మరణ చేసినప్పుడు మీరు అన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. మీ మనస్సే ఒక వీణ. అందులో చెడ్డభావాలనే ‘అపస్వరాలు' రాకుండా చూసుకోండి. మనస్సనే వీణపై పవిత్రమైన భగవన్నామాన్ని పలికిస్తూ మీ జీవితాన్ని గడపండి. అప్పుడే మీకు భగవదనుగ్రహప్రాప్తి కలుగుతుంది.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...