మనకు భగవంతుడి పట్ల ఉండే కృతజ్ఞతా భావం, మనం ఆనందంగా జీవించడానికి సహాయపడే మూల సాధనం. అంతా ఈశ్వరేచ్చ అనే రెండు పదాలతో మొదలయ్యే ఈ ఆనందయాన గమ్యం సచ్చిదానందం.
ఓం శివోహం... సర్వం శివమయం.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...
No comments:
Post a Comment