మాయలో పడి భ్రాంతి చెంది
దేహాత్మ భావనతో దేహెంద్రియ మనోబుద్దుల స్థాయిలోనే ఉంటే ఎదుటివారిలో వికారాలే గోచరిస్తాయి.
అదే ఆత్మ సాక్షత్కారాన్ని పొంది ఆత్మభావనతో ఉంటే ఎదుటివారిలో, అంతటా ఆత్మ ఒక్కటే గోచరిస్తుంది.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...