Saturday, April 1, 2023

శివోహం

భక్తుని కర్తవ్య విధులు...

భగవంతుని శరణుకోరిన వారు తమ జీవితంలో జరిగే మంచిచెడులన్నీ భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగుతున్నాయని భావిం చాలి. తమకు కలిగిన సంతోషాన్ని ఎవరితో అయినా పంచుకోవచ్చు కానీ కష్టాలను, బాధల ను ఎవరికీ చెప్పుకోకూడదు. బాధపడకూడదు. ఎవరి కైనా చెప్పుకుంటే మనోభారం తగ్గుతుం దని భావించి ఇతరుల వద్ద వెల్లడిస్తారు. అలా చేస్తే కష్టాలకు లొంగిపోవడమే అవుతుందని అంటారు మన భాష్యకారులు. మానవ జీవితం లో ఎదురయ్యే ఒడిదుడుకులకు తలొగ్గకుండా తమ జీవన కర్తవ్యాన్ని నెరవేర్చాలని చెబుతా యి మన ఇతిహా సాలు. నిజమైన భక్తులు ఎలా వుండాలి? తమ విధులను ఎలా నిర్వర్తించాలో తెలుసుకుందాం.
చేసే ప్రతి పనిని భగవంతుని సేవగా భావించి చేయాలి. భగవంతుని సేవలో నిమగ్నమైన గొప్ప భక్తులను కూడా చిత్తశుద్ధితో సేవించాలి. వారి నుంచి భాష్యాలను అధ్యయనం చేయాలి. వాటిని మానవాళి ప్రయోజనం కోసం ప్రతిచో టా ప్రచారం చేయాలి.
దైనందిన కార్యక్రమాల్లో ఎంత బిజీగా వున్నా 24 గంటల సమయంలో కొంత సమ యం ఆలయాల పరిశుభ్రత, నిర్వహణకు కేటా యించాలి. స్వామివారి పుష్పాలు, అలంకరణ లు నైవేద్యాలు… ఇలా చేతనైన సేవ చేసుకోండి.
భక్తులు కానివారి ఇళ్లలో సమర్పించే ప్రసాద మైనా, తీర్థమైనా స్వీకరించకూడదు.
విష్ణు దేవాలయంలో భగవంతుని సన్నిధిలో ఉంటే భక్తులు కానివారు చుట్టూ ఉన్నా తీర్థం, ప్రసాదం తీసుకోవచ్చు.
పవిత్ర స్థలంలో తీర్థం, ప్రసాదాలను ఎట్టి పరి స్థితుల్లోనూ తిరస్కరించకూడదు. ఉపవాసం ఉన్నప్పటికీ దేవాలయాలలో తీర్థం, ప్రసాదాల ను తిరస్కరించకూడదు.
భక్తులు కాని వారి ఇళ్ళల్లోని పటాలను పూజించకూడదు.
భక్తుడు అవమానించినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎదురు తిరిగే ప్రయత్నం చేయకూడదు.
శాశ్వతమైన ఆనందాన్ని పొందాలనే తపన ఉన్నవారు భక్తులందరి క్షేమం కోసం ప్రయత్నించాలి.
భెగవంతునికి శరణాగతి చేసిన తర్వాత కొన్ని సుఖాలు పొందినప్పటికీ, దైవసంక ల్పానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు.
తినే ఆహారమంతా ముందుగా భగవం తునికే సమర్పించాలి. పువ్వులు, పండ్లు, సువాసనలు, ఇలాంటి వాటిని మొదట భగ వంతుడికి అంకితం చేయకుండా తీసుకో కూడదు.
భగవంతునికి సమర్పించే నైవేద్యాన్ని ఒకరి వ్యక్తిగత అభిరుచిని బట్టి ఎంపిక చేసుకో కూడదు.
భగవంతునికి సమర్పించే నైవేద్యం తాజాగా ఉండాలి. ఆరోజు తయారుచేసిన పదార్థాలనే నైవేద్యంగా సమర్పించాలి. రాత్రి చేసిన వంట కాలను మరుసటిరోజు ఉదయం నైవేద్యంగా పెట్టకూడదు.
దేవునికి సమర్పించిన సమస్త నైవేద్యాలను అందరికి పంచిపెట్టాలి. ఒక్కరే తినకూడదు.
భెక్తులు ఇతరులు చూసిన లేదా రుచి చూసిన ఆహారాన్ని తినకూడదు.
భక్తి లేనివారు దానం చేసినా, ధనం ఇచ్చినా, విలువైన వస్తువులు అడగకుండా ఇచ్చినా తీసు కోకూడదు.
శాస్త్రాలు నిర్దేశించిన అన్ని ఆచారాలు వేడుక లు అత్యంత అంకిత భావంతో, శరణాగతి, స్ఫూర్తితో చేయాలి.
దేవాలయం లేదా భగవంతుని సన్నిధిని సూ చించే ఇతర నిర్మాణాలను దాటి వెళ్ళేటప్పుడు వాటి ముందు భక్తితో నమస్కరించా లి.
³భెక్తులను అవమానించడం ఆత్మ వినాశనా నికి దారితీస్తుంది.
భగవాన్‌ (భగవంతుడు), భాగవతాలు (భక్తు లు) ఇద్దరికీ సేవ చేయకుండా ఒక వ్యక్తి ఎప్పటికి ముక్తిని పొందలేడు.
భగవంతుని (భగవాన్‌) ఆరాధనకంటే భక్తుల (భాగవత) ఆరాధన శ్రేష్టమైనది. భక్తుని తీర్థ ము, ప్రసాదము భగవంతునికంటే శ్రేష్టమైనది.
భగవంతుడు, భక్తులు లేదా ఆచార్యుల సమక్షంలో మర్యాద పూర్వకంగా, గౌరవప్ర దంగా కూర్చోవాలి.
జ్ఞానం, భక్తి, వైరాగ్యం కలిగిన భక్తులు వారు పుట్టిన సామాజిక వర్గం లేదా కులంతో సంబం ధం లేకుండా గౌరవించబడాలి.
ఇతరుల గురించి పదేపదే చెడుగా మాట్లాడే వారితో సహవాసం చేయకండి. ఇతరులను దూషించడం మానండి.

శివోహం

*"మంచిమాటలు"*

*అందరికీ అలంకారం ధర్మం.*

*వినయ సంపన్నమైన విద్య అలంకారాలకి అలంకారం.* 

*పెద్దల దగ్గరికీ, గురువుల దగ్గరికీ, దేవుడి గుడికి, చిన్న పిల్లలు ఉన్న దగ్గరికీ వెళ్ళేటపుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు.*

*వినాశం దగ్గర పడ్డవాడు హితం చెపితే వినడు.*

*తనకు చేసిన నువ్వుగింజంత ఉపకారం కూడా పర్వతం అంతగా భావిస్తాడు సత్పురుషుడు.*

Friday, March 31, 2023

శివోహం

ఓం నమః శివాయ
జగత్తు అనగా...?
ఆద్యాత్మిక , ఆదిభౌతిక , ఆదిదైవిక మైనదే జగత్తు
1. ఆద్యాత్మిక - దేహం , ప్రాణం , ఇంద్రియములు , మనస్సు , సుఖం , దుఃఖం , నేను అని అనిపించునది.
2. ఆదిభౌతిక - ఆకాశం , వాయువు , అగ్ని , జలము , భూమి .
3. ఆదిదైవికo - గ్రహములు , నక్షత్రములు , సూర్య చంద్రులు , లోక లోకంతరాలు .
ఇదియే జగత్తు .

శివోహం


భక్తుడి విశిష్టత!

భగవంతుడిదీ భక్తుడిదీ విడదీయ లేని బంధం. విడ దీయరాని అనుబంధం. ఒకరు ఉంటేనే మరొకరు. ఓ తత్వముంటేనే మరొక తత్వం.
భగవంతుడు లేనిదే భక్తుడుండడు. భక్తి ఉండదు. భక్తుడు లేకపోతే భగవంతుడికి ఆకారం ఉండదు. సాకారం ఉండదు. భక్తుడుంటేనే భగవంతుని దర్శనం అవసరమ య్యేది. ప్రత్యక్షమవటం, ప్రసన్నమవటం యిత్యాది విషయా లకు ప్రాముఖ్యత వచ్చేది. భగవంతుడు ఉంటేనే భక్తుడికి పూర్ణత్వం పరిపూర్ణత్వం, మోక్షత్వం, అమరత్వం లభించేది.
భక్తుడు భగవంతుని కోసం తపిస్తాడు. తపన పడతాడు. భగవంతుడు తన భక్తుడి మీద నిండుగా మెండుగా దండిగా అనుగ్రహం కురిపించేటందుకు, అనుక్షణం ఆరాటపడుతుం టాడు. భగవంతుడు భక్తుడు యిద్దరూ… ఒకరికి మరొకరు తోడుగా, నీడగా, జోడుగా, జోడీగా, ఉంటేనే భక్తి భగవత్‌ తత్వాలు రెండూ ఉండేవి. భక్తికో విధం, పధం, విధానం, మార్గం ఉండేది. భగవంతుడికి ఓ రూపం, స్వరూపం, గుణం, నామం ఉండేది. సాలోక్యత ఉండేది. సామీప్యత ఉండేది. సారూప్యత, సాయుజ్యం ఉండేది. అంతటి అవినా భావ అనుబంధం భగవంతుడుది భక్తుడిదీ.
అయితే భగవంతుడు భక్తుడు వీళ్ళిద్దరిలో ఎవరు
గొప్ప? అనే సందేహం సహజంగా కలిగేదే.
ఓసారి ఓ కొం-టె- శిష్యుడికి ఈ సందేహమే కలిగింది. సందేహం రావడమే ఆలస్యం, సందేహ నివృత్తి కోసం తిన్న గా గురువుగారిని ఆశ్రయించాడు. ”భగవంతుడు భక్తుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప?” అని గురువుని అడిగాడు.
వెంటనే గురువు శిష్యుణ్ణి ”పంచభూతాలు ఉన్నాయి
కదా? వాటిలో ఏది గొప్పది?” అని అడిగారు.
”నీరు మూడొంతులు ఉంటే భూమి ఒక వంతే ఉంది
కదా స్వామీ! కాబట్టి నీరే గొప్పది” అని శిష్యుడు సమాధానం చెప్పాడు.
అది విన్న గురువుగారు ”అంత గొప్పది అయిన నీటిని అగస్త్యుడు ఒక్క గుక్కలో ఔపోసన పట్టేసాడు. మరి నీరు
గొప్పదా? అగస్త్యుడు గొప్పవాడా?” అని అడిగారు.
”అంత గొప్పదైన నీటిని ఔపోసన పట్టేసిన అగస్త్యుడే
గొప్పవాడు” అని సమాధాన మిచ్చాడు శిష్యుడు.
”ఆహా! అలాగా. అంత గొప్పవాడైన అగస్త్యుడు ఆకాశం లో ఉంటాడు కదా? ఆకాశం గొప్పదా? అగస్త్యుడు గొప్ప వాడా?” అని మరో ప్రశ్న వేసారు గురువుగారు.
”గొప్పవాడైన అగస్త్యుని నివాసం ఆకాశం కాబట్టి, ఆకా శమే గొప్పది” అని శిష్యుడు బదులిచ్చాడు.
”అంతటి విశిష్టమైన ఆకాశాన్ని, భగవంతుడు వామన రూపంలో ఒక్క పాదంతో ఆక్రమించేసాడు. మరి ఆకాశం గొప్పదా? భగవంతుని పాదం గొప్పదా?” అని మళ్ళీ ప్రశ్నిం చారు గురువుగారు.
భగవంతుని పాదమే గొప్పదన్నాడు శిష్యుడు.
”భగవంతుని పాదమే అంత గొప్పది అయినప్పుడు, భగవంతుడు ఎంతటి గొప్పవాడై ఉండాలో ఆలోచించు” అన్నారు గురువుగారు.
”అవును స్వామీ! భగవంతుడు నిజంగా చాలా
గొప్పవాడు” అన్నాడు శిష్యుడు.
అపుడు గురువుగారు శిష్యుడితో ”చూడు నాయనా! అంత గొప్పవాడైన భగవంతుడు భక్తుడి హృదయంలో ఉం టాడు కదా! అపుడు భగవంతుడు గొప్పవాడా? భక్తుడు గొప్ప వాడా? అని మళ్ళీ ప్రశ్నించారు గురువు గారు.
వెంటనే ”భగవంతుడు భక్తుని హృదయంలో బందీగా ఉంటాడు కాబట్టి భక్తుడే గొప్పవాడు” అని సమాధానమిచ్చా డు శిష్యుడు.
ఇదీ భక్తుడి విశిష్టతని ఉదాహరణ పూర్వకంగా, చాకచక్యంగా చమత్కారంతో చెప్పే కథ!
భగవంతుడ్ని ఒప్పించేది, మెప్పేంచేది, బంధించేది, బంధన చేసేది, చిక్కేంచేది, చిక్కేలా చేసేది, దక్కేంచేది, దక్కే లా చేసేది భక్తి ఒక్కటే. అంతటి మహోన్నతమైన శక్తి గలది భక్తి.
అంతటి శక్తివంతమైన భక్తి కోసం తపించాలి. తపన పడాలి. వేదన పడాలి. రోధించాలి. సాధన చేయాలి. శోధన చేయాలి. అలాంటి భక్తి తత్వాన్ని సంపాదించాలి. స్వంతం చేసుకోవాలి. సాఫల్యం చేసుకోవాలి. అసలు సిసలైన భక్తి తత్వాన్ని ఆకళింపు చేసుకోవాలి. అనుభవించాలి. అనుభవం లోనికీ తెచ్చుకోవాలి.
ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రులం కావాలి. పునీతులం కావాలి.

 

శివోహం

శివా!దేహంపై మాకు వ్యామోహం 
దానికి మేము దాసోహం
"దా" తొలగించు "సోహం"నెరిగించు
మహేశా . . . . . శరణు.

శివోహం

ప్రతి చిన్న బిందువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతి దానిలో నిండి ఉంటూ ఈ విశ్వానికి శివుడే ఆధారం.
ప్రతి వస్తువు శివుడి వల్లే ఉద్భవిస్తుంది...
వాటి కదలికలు కూడా శివుడే నిర్దేశిస్తాడు..
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

*"సూక్తి ముక్తావళి"*
*కర్తా కారయితా చైవ,*
*ప్రేరక శ్చానుమోదకః,*
*సుకృతే దుష్కృతే చైవ,*
*చత్వార స్సమభాగినః.*

పుణ్యంలోనైనా, పాపంలోనైనా, చేసినవాడు, చేయించినవాడు, చేయమని ప్రోత్సహించిన వాడు, చాలా బాగా చేశావు అని అభినందించిన వాడు వీళ్ళు నలుగురికి ఫలితం సమంగా లభిస్తుంది.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...