మన సమస్త దుఃఖాలకు, అశాంతికి మనలోని భావదోషాలే కారణం. ఈ విషయం అవగాహన అయినప్పుడు సుఖశాంతుల కోసం ఎక్కడెక్కడో వెతకం. మన మనసును శుద్ధిచేసుకుని సుఖశాంతులను పొందవచ్చు. మనసుకు అలవాటైన తలపుల నుండి అభ్యాసంతో విముక్తి పొందవచ్చు. దేవాలయంలో ఉన్నప్పుడు అక్కడ ప్రతి ఒక్కరూ మంచి వారుగానే కనిపిస్తారు. కానీ మనిషి నిజమైన మంచితనం సమాజంతో తాను కొనసాగించే సత్సంబంధాలతోనే ఉంటుంది. తాను కాకుండా ఇతరులంతా కలిసింది సమాజం. తల్లిదండ్రులు, భార్యపిల్లలు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగువారు, సహోద్యోగులు చివరికి గురువుతో సహా వీరితో మన ప్రవర్తన ఎలా ఉందో మనకు మనమే తెలుసుకోవచ్చు. దైవంవద్ద, గురువువద్ద వినయంగా ఉండి తనకు తానుగా మంచివాడనుకుంటే సరిపోదు. ధర్మజీవనం అలవాటైతే గాని మన జీవితంలో ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలో తెలుస్తుంది. ప్రతి ఒక్కరితో అవసరమైనంత పరిమితంగా ఉంటే అదే వైరాగ్యాన్ని అలవరిస్తుంది. అప్పుడు భావదోషాల నుండి విముక్తి లభిస్తుంది !
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Monday, April 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
శివోహం
కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి అజ్ఞాన అంధ వినాశ ...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! యోగినై సంచరిస్తున్నా ఆత్మ వేత్తనై పరిశీలిస్తున్నా నిర్దారించలేని సృష్టి రహస్యం ఊ...
-
లేనిది కావాలనిపిస్తుంది ఉన్నది వద్దనిపిస్తుంది… సూదూరంగా ఉన్నవి సౌందర్యంగా చేరువైనవి వ్యర్ధంగా… శాంతినిచ్చేవి చీకాకుగా అశాంతి నిచ్చేవి ఆనందం...
No comments:
Post a Comment