Monday, April 26, 2021

శివోహం

మన సమస్త దుఃఖాలకు, అశాంతికి మనలోని భావదోషాలే కారణం. ఈ విషయం అవగాహన అయినప్పుడు సుఖశాంతుల కోసం ఎక్కడెక్కడో వెతకం. మన మనసును శుద్ధిచేసుకుని సుఖశాంతులను పొందవచ్చు. మనసుకు అలవాటైన తలపుల నుండి అభ్యాసంతో విముక్తి పొందవచ్చు. దేవాలయంలో ఉన్నప్పుడు అక్కడ ప్రతి ఒక్కరూ మంచి వారుగానే కనిపిస్తారు. కానీ మనిషి నిజమైన మంచితనం సమాజంతో తాను కొనసాగించే సత్సంబంధాలతోనే ఉంటుంది. తాను కాకుండా ఇతరులంతా కలిసింది సమాజం. తల్లిదండ్రులు, భార్యపిల్లలు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగువారు, సహోద్యోగులు చివరికి గురువుతో సహా వీరితో మన ప్రవర్తన ఎలా ఉందో మనకు మనమే తెలుసుకోవచ్చు. దైవంవద్ద, గురువువద్ద వినయంగా ఉండి తనకు తానుగా మంచివాడనుకుంటే సరిపోదు. ధర్మజీవనం అలవాటైతే గాని మన జీవితంలో ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలో తెలుస్తుంది. ప్రతి ఒక్కరితో అవసరమైనంత పరిమితంగా ఉంటే అదే వైరాగ్యాన్ని అలవరిస్తుంది. అప్పుడు భావదోషాల నుండి విముక్తి లభిస్తుంది !

_*"సృష్టి నీ ఉనికిని తెలుపుతుంది.. నీవు నీ స్వరూపం తెలుసుకో..!"

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...