Friday, May 28, 2021

శివోహం

భయమును  సృష్టించేవారు, తీసేసే వారు పరమాత్మే.  కనుక  మనమెప్పుడు పరమాత్మని  ప్రసన్న వదనంతో వున్న మూర్తియై కనపడమని కోరుకోవాలిట. కష్టము కలిగించే వాడు పరమాత్మే, కష్టాన్ని తీసేసే వాడు పరమాత్మే. కష్ట కాలములో తనని మర్చిపోయేటట్టు చేసేది పరమాత్మే. మనస్సులో పరమాత్ముని పాదములు  వదలకుండా పట్టుకుని, నన్ను మన్నించి నీ  త్రోవలో నన్ను పెట్టుకో అని మనః స్ఫూర్తిగా ప్రార్దించినట్లైతే, అయన సంతోషించి, మనకు  కలిగిన గాయాన్ని మాన్పించి యధా మార్గంలో పెడతారు. 

ఓం శివోహం...సర్వం శివమయం

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...