Friday, April 22, 2022

శివోహం

జీవుడు ప్రపంచాన్ని గురించి అనేక భ్రమలలో ఉంటాడు....
ఎందుకు, మనఃశాంతికి మార్గం తెలుసుకోలేకున్నాడు

క్షణం మోనం, క్షణం జ్ణానం ఎందుకు పనికొస్తుందంటాడు...

ఈ ప్రపంచం సత్యమనుకుంటాడు.
ఇందులోని వస్తువులు, విషయాలు, భోగాలు అన్నీ నిత్యమైనవి అనుకుంటాడు...

ఇవన్నీ తనకు ఎంతో ఆనందాన్నిస్తాయి అనుకుంటాడు....

అందుకే వీటికోసం అర్రులు చాస్తూ ప్రపంచంలోనికి పరుగులు తీసి, ఎన్నో కష్టనష్టాల కోర్చి వాటిని సంపాదించుకుంటాడు, అనుభవిస్తాడు

వాటివల్ల ఆనందం పొందినట్లే పొంది చివరకు దుఃఖాన్ని పొందుతాడు.

ఇక తన గురించి కూడా భ్రమలలో ఉంటాడు.


తాను దేహమే అనుకుంటాడు.

లేదా దేహాన్ని ధరించిన జీవుణ్ణి అనుకుంటాడు.

తాను సుఖాలు, భోగాలు అనుభవించటానికే పుట్టా ననుకుంటాడు.

తాను శాశ్వతంగా ఉంటాననుకుంటాడు. రోజూ ఎందరో చనిపోతున్న…


జీవుడు ప్రపంచాన్ని గురించి అనేక భ్రమలలో ఉంటాడు.

ఎందుకు, మనఃశాంతికి మార్గం తెలుసుకోలేకున్నాడు

క్షణం మౌనం, క్షణం జ్ణానం ఎందుకు పనికొస్తుందంటాడు

వీరిని మార్చే శక్తి నీకే ఉంది కదా పరమేశ్వరా...






No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...