Tuesday, June 30, 2020

అమ్మ దుర్గమ్మ

అమ్మను కొల్చిన దక్కనిదేమిటి
దుర్గను కొల్చిన దక్కనిదేమిటి
ఆదిశక్తి నీవు తల్లి మూలశక్తివి నీవు
నిను ధ్యానించెద నోయమ్మా
నను కాపాడుము మాయమ్మా

శివోహం

లోకాల పాలన చేయగ ...
విశాఖ పురమున వెలసిన ...

శ్రీ కనక మహాలక్ష్మీ ...

చినుకుల చిటపటల వలే   నీ చల్లని చూపు ...

నల్లని మబ్బుల చక్కటి వర్షపు ధారల ..
నిండార కురిసేడి  నిరపేక్షగ  నీ దయ ...

ఎక్కడ...ఎవరికి ఎలా  కురిపిస్తావో ...?
చిత్రమైనది నీ కటాక్షం ...

కావాలన్నవాడికి  పడనివ్వు  నీ జడి  ...
వొద్దన్నవాళ్ళకి  పడకుండా ఆగవు ...

తోడుగనీడగ  నాబిడ్డలుండగ ...
నాకు నీడెందుకనుచూ ...
తాటియాకుల పందిరి మాత్రమే 
వేయించుకున్న నీ ఘనతను 
ఏవిధముగానూ నేను  వర్ణించలేను తల్లీ ...
నిన్ను శరణుజొచ్చెడు భక్తులము మేము  ...

శివోహం

నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
నమ్మిన వాడిని మంచిచెడు తెలియనివాడిని
ఈశ్వరుడే దైవమని నమ్ముకొన్నవాడిని
ఓ హరిహరేశ్వరా పాపాలు హరించరా
ఓ పరమేశ్వరా ముక్తి ప్రసాదించారా

శివోహం

శంకరా!!!! నీ ధ్యాసలో ఏ శక్తి ఉన్నదో ,
ఏ మర్మం ఉన్నదో తెలియదు కాని
నీ ధ్యాసలో నన్ను నేను మరచిపోయాను 
నీ ధ్యాసలో పూర్తిగా నేను నువ్వైపోయాను . .

శివోహం

అంజనమ్మ ముద్దుబిడ్డ! ఆంజనేయా!
అంజలించినాడ నన్ను ఆదుకోవయా!
నారదాది మునులకే నీవు సఖుడవు
రామభక్త కోటిలో నీవు ఘనుడవు
ధర్మమర్మ విధులలో నీవు మేరువు
ప్రాణదాన దీక్షలో నీవు ప్రభువువు
#శ్రీఅంజనేయం

శివోహం

తత్ప్రణమామి సదాశివలింగం
ఉపనిషత్తులు పరమాత్మను ‘సత్యం-శివం-సుందరం అని నిర్వచించాయి. అతడే పరమమైన సత్యం, పరమైన శుభము, సుందరం అన్నాయి. అతడే శివ్ఞడు పరతత్వమే శివతత్వమనీ, సర్వకారణమనీ విష్లేశించాయి. పరతత్వమైన పరమశివుని ఆరాధించడం భారతీయ సంస్కృతి, సృష్టి స్థితి లయలకు హేతువైన శివ్ఞని లింగరూపంగానూ, మూర్తిరూపంగానూ ఆరాధించడం సంప్రదాయం.

ఈ రూపాలు ‘అకల, ‘సకల తత్వానికి సంకేతాలు. లింగం ‘అకల (నిర్గుణ) తత్వానికి, మూర్తి ‘సకల (సగుణ) తత్వానికి సంబంధించిన విధానాలు నిరాకార, సాకార రూపంగా సదాశివ్ఞని ఆరాధించడం సంప్రదాయం. లింగార్చన అత్యంత ప్రాచీనం, సనాతనం నిర్గుణ, సగుణ రూపాలు, అకలము, సకలముగా చెప్పిన అన్నిరూపాలు ఆరాధనీయాలే. లింగం నిర్గుణమైతే, చంద్రశేఖర, జటాజూట త్రిశూలపాణి వంటివి సగుణరూపాలు ప్రధానంగా లింగతత్వము పరమశివ్ఞని పరమతత్వస్వరూపం. ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మకు, స్థితి భర్త విష్ణువ్ఞకు తామిరువ్ఞరులో అధికుడెవ్వరన్న వాగ్వివాదం ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసింది. ఆ యుద్ధం ముల్లోకాలలో సంక్షోభానికి దారితీసింది. దేవతలు భయంకంపితులై సదాశివ్ఞని శరణు వేడారు.

సదాశివుడు హరిబ్రహ్మల మధ్య ఆది అంతములు తెలియని మహాలింగంగా ఆవిర్భవించారు. ఇరువ్ఞరు మహాతేజస్సుతో ప్రకటితమైన ఆ అగ్ని లింగాన్ని చూసి అప్రతిభులయ్యారు. ఆది అంతములు తెలుసుకున్నవారే అధికులని లింగం నుండి వాణి వినిపించింది. హరి వరహరూపంలో ఆదిని తెలుసుకోడానికి, హంసరూపంలో బ్రహ్మ అంతం కనుగొనడానికి ఉద్యమించారు. ఇరువ్ఞరూ విఫలమయ్యారు. లింగరూపంలో ఉన్న శివ్ఞడు ప్రత్యక్షమై హరి బ్రహ్మలకు తత్త్వోపదేశం చేశాడు.”వాస్తవానికి ఒకే తత్వం హరి బ్రహ్మలుగా వ్యక్తమైందనీ, అనంతమైన ఏకత్వమే అసల సత్యమనీ, ఆపరమ సత్యాన్ని తెలియజేసేటందుకు అగ్ని లిగంగా ఆవిర్భవించానీ అన్నాడు. ఆ తత్వాన్ని గ్రహించి బ్రహ్మమురారులతో పాటు సకల దేవతలు. ఋషులు సదాశివ్ఞని లింగరూపంలో ఆరాధించారు. ఈ సంఘటన మాఘశుక్ల చతుర్ధినాడు జరిగింది. రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం ఈ జ్వాలాలింగ మహారూపాన్ని దర్శించక దేవతా సమూహం ఆతేజస్వరూపాన్ని ఉపహరించమని ప్రార్ధించగా,శాంతించిన పరమశివ్ఞడు పార్థివ లింగరూపంలో పృద్వీనిపై ఆవిర్భవించాడు. అదే మహాశివరాత్రి పర్వదినం. ఆ తేజస్సు ‘అగ్నికాదు. పంచభూతాలకు ఆదియైని జ్యోతిస్వరూపం శివ్ఞని జ్యోతిర్లింగంగా ప్రభవించినట్లు పురాణాలు వచిస్తున్నాయి.

జ్యోతిర్లింగ క్షేత్రాలు- సేరాష్ట్రే సోమనాధం చ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకారమమలేశ్వరం, పరల్యాం వైధ్యనాథం చ, ఢాకిన్యాం భీమశంకరం, సేతుబంధే చ రామేశం, నాగేశం,దారుకావనే, వారాణాశ్యంతు విశ్వేశం, త్య్రయంబకం గౌతమీ తవే, హిమాలయేతు కేదారం, ఘశ్మేశంచ శివాలయే పన్నెండు స్వయంభూలింగాలుగా ఆవిర్భవించిన శివ్ఞడు లోకరక్షణ చేస్తున్నాడు. ఇవికాక, శ్రీఆది శంకరులు శివ్ఞని ద్వారా పొందిన పంచభూత్మాకమైన ఐదు స్ఫటికలింగాలను -పృథ్వీలింము(కాంచీక్షేత్రం) జలలింగం (జంబుకేశ్వరం) అగ్నిలింగం (అరుణాచలం)వాయులింగం (శ్రీకాళహస్తి), ఆకాశలింగం (చిదంబరం) క్షేత్రాలలో ప్రతిష్టించారు. తారాకా సుర సంహానంతరం, ఆ అసురుని హృదయంలో ఉన్న శివలింగం విచ్ఛిన్నమై ఐదు ప్రక్కలైంది. అవి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో పంచారామాలు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలలోని శివలింగ క్షేత్రాలుగా ప్రాచుర్యం పొందాయి. ‘లయనాత్‌ లింగముచ్చతే అని నిర్వచనం దేని యందు సర్వ జగత్తులీనమై ఉంటుందో ఈ పరతత్వమే లింగం. ‘చిహ్నమని అర్ధం. పరమశివ్ఞని ప్రతీక. అర్థనారీశ్వరతత్వం. ఆ తత్వాన్ని తెలుసుకోవడం అసాధ్యం.

శివలింగం పానీపట్టం చేత ఆవృతమై ఉంటుంది. పానీవట్టం ప్రకృతీ శక్తికి ప్రతీక. అర్ధనారీశ్వర తత్వమే పానీవట్టం చేత చుట్టబడిన శివలింగతత్వం, శక్తి సంస్పర్శచేత శివ్ఞడు వ్యక్తమేతున్నాడు. పానీపట్టమే యోనిపీఠం శక్తిపీఠం. వ్యాపకశీలమైన ప్రకృతీతత్వమే యోని ఉత్పత్తికి ఉపాధాన కారణమైన శివ్ఞడే లింగం. ‘యోనిని ‘భగము అన్నారు. ‘భగము కలవాడు భగవానుడు ఇలా ప్రకృతిశక్తులు పార్వతీ పరమేశ్వరుడు ల సంయోగం కారణంగా ఈ జగత్తు సృష్టి జరిగింది. ఉపనిషత్తులు,పురాణాలు, భగవద్గీత,లలితోపాఖ్యానం మొదలైన గ్రంధాలన్నీ ఈ విషయాన్ని స్పష్టపరిచాయి. సృష్టిస్థితి లయాత్మకమైన శక్తి సంయోగం చేతనే శివ్ఞడు ‘కర్త-కర్మ అవుతున్నాడు.

లింగనేది పార్వతి లింగం శివ్ఞడు,ఈ జగత్తుకు తల్లిదండ్రులు. లింగాన్ని అర్పించడమంటే మాతాపితురులను అర్పించినట్లే బ్రహ్మ విష్ణురుద్రాత్మకమైన పరంజ్యోతిస్వరూపమే శివలింగమని శాస్త్రాలు వచిస్తున్నాయి. లింగార్చనకు మించిన సాధన లేదు. సమస్తపాపాలను భస్మం చేసి ఇహపరభోగాలను అందించి కడప శివసాయుజ్యాన్ని ప్రసాదించే శక్తి లింగార్చనకు ఉంది. కాళిదాసు నుడివినట్లు ‘వాగార్ధసంప్త్రుకౌ వాగర్భములవలే కలిసియున్న పార్వతీ పరమేశ్వరులను అర్పించాలి. ఇంకా ఏమన్నాడంటే- ఏమిలేనివాడైనా సంపదలునిచ్చేవాడు, శ్మశానవాసియైనా త్రిలోకనాధుడు,భయాంకర రూపం కలవాడైనా మంగళస్వరూపుడు శివ్ఞడు శివ్ఞని యదార్ధ స్వరూపం తెలిసినవారు లేరు. అన్నాడు. వేదస్వరూపుడు,సంసార జనిత దుఃఖాలను హరింపజేసేవాడు,శాంతుడు,శంభుడు,శుద్ధుడు,మంగళకరుడు సదాశివ్ఞడు అట్టి మంగళమయ జీవితాన్ని ప్రసాదించే శివ్ఞని మహాశివరాత్రినాడు పనసారా ప్రార్ధిద్దాం తత్ప్రణమామి సదాశివలింగం.

శివోహం

*సత్యవాక్పరిపాలకుడు శ్రీరాముడు*

”రకారం అంటే అజ్ఞానం, మాయ అని ”మ అంటే వాటిని నిరోధించేదనీ, అదే జ్ఞానమనీ, ”రామ శబ్దానికి అర్థం చెబుతారు పండితులు. జ్ఞానులు! పరబ్రహ్మ వాచకమే రామశబ్దమంటారు ”తత్వజ్ఞులు. నిత్యమూ క్షణం సేపైనా రామనామాన్ని ఉచ్ఛరించేవారు సమస్త సిద్ధులనూ పొందుతారని విశ్వామిత్ర సంహితలో చెప్పబడింది. రామనామస్మరణతో సమస్త పాపాలూ పరిహరింపబడతాయట. భగవంతుని నామాలు ఎన్ని ఉన్నా అత్యంత మహిమాన్వితమైనది ”రామనామం. నారదుడు ఒకసారి భగవంతుని వద్దకు వెళ్లి తరింపజేసే నామాన్ని తెలియజేయమని అడుగగా, ఇతర నామముల కన్నా శ్రేష్ఠమైన రామనామాన్ని నిర్మించి ఇచ్చినట్లుగా ”తులసీదాసు అన్నాడు. నారదుడు దాన్ని ప్రచారం చేశాడు. పరమశివ్ఞడు కాశీనగరంలో భవానీతో కలిసి నివసిస్తూ, అక్కడ మరణించే వారి చెవిలో రామనామాన్ని ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాడని అంటారు.

రామా! నీ నామాన్ని పలికినంతనే మహాపాపియు పవిత్రుడవ్ఞతాడని మహర్షులు అన్నట్లు పురాణవచనం. ”రామోవిగ్రహాన్‌ ధర్మః శ్రీరామచంద్రుడు మూర్తీభవించిన ధర్మమే. పుత్రునిగా, సత్యవాక్‌పరిపాలునిగా, శిష్యునిగా, భర్తగా, రాజుగా వీరాధివీరునిగా, స్నేహశీలిగా, భక్తజనసంరక్షకునిగా ఆయన ఆదర్శపురుషుడు. తల్లిదండ్రులందరూ తమ పుత్రులు శ్రీరామునిలా ఉండాలని, ప్రతి భార్యా తన భర్త రాముని వంటి పవిత్ర మూర్తియై ఉండాలని కోరుకుంటారు. ప్రతీ భారతీయుడూ రామనామస్మరణ చేస్తూ, ఆయనను పూజిస్తూ, తన జన్మను సార్థకం చేసుకుంటాడు. పరిపాలకులు ఆ ప్రభువ్ఞను ఆదర్శంగా తీసుకున్ననాడు దేశం సుభిక్షమై, రాజ్యం రామరాజ్యంగా భాసిల్లుతుంది. రామయ్యతండ్రి జన్మించినది చైత్ర శుద్ధ నవమినాడైతే, ఆయనకు సీతమ్మ తల్లితో పెండ్లి జరిగినదీ ఆరోజునేనట. కానీ సీతారాముల పెండ్లి జరిగినది మార్గశిరమాసంలో అని శ్రీరామదాసు వసంత నవరాత్రులు జరుపుతూ రామనవమి ఉత్సవాల్లోనే కళ్యాణం జరిపే ఆనవాయితీని ప్రవేశపెట్టాడని అంటారు.

భద్రాచలంలో ఎలా జరిగితే అదే ప్రమాణం కాదుకదా మరి? భార్యాభర్తల అనురాగానికి, అన్నదమ్ముల అనుబంధానికి ఎంతటి ప్రాముఖ్యత నిచ్చాడో, స్నేహానికి అంతటి ప్రాముఖ్యతను ఇచ్చాడు రామచంద్రుడు. పక్షియైనా జటాయువ్ఞకి, అంతిమసంస్కారాలు జరిపి, ముక్తిని ప్రసాదించిన దయాసాగరుడు. ఆటవికుడైనా గుహుడిని, వానరుడైనా సుగ్రీవ్ఞడిని, రాక్షసకులంలో పుట్టినవాడైనా విభీషణుడిని ఆదరించి అక్కున చేర్చుకున్న మహనీయమూర్తి. ధర్మగంటను మోగిస్తే కుక్కకు సైతం న్యాయం చేసిన ధర్మమూర్తి. అమిత పరాక్రమశాలియైన రావణాసురుని సంహరించి, తన సత్య, ధర్మ, ప్రవర్తనను ఉన్నత వ్యక్తిత్వాన్ని లోకానికి చాటిన ధీశాలి. తన ప్రజల అభిప్రాయాన్ని తలదాల్చి తాను ప్రాణ సమానంగా ప్రేమించే ఇల్లాలిని పరిత్యజించిన త్యాగమూర్తి. ఇలా ఇన్ని సుగుణాలు ఒకే వ్యక్తిలో ఉండడమనేది రామచంద్రునికే చెల్లింది. మధురంగా మాట్లాడేవాడు, శాంతచిత్తుడు. వీరాధి వీరుడైనా అహంకారం లేనివాడు. కనుకనే ఈనాటికీ ఆయనను పూజిస్తున్నాం. ఆరాధిస్తున్నాం. రాముని గుడిలేని చిన్న పల్లె కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...