Wednesday, March 30, 2022

శివోహం

నిమిత్తమాత్రం భవ!
కొబ్బరి చెట్టు ఎక్కేవాడు చెట్టుకు నమస్కరించి ఎక్కుతాడు. అంటే, ఎక్కే శక్తి తనకు లేక కాదు. పైకి పోయినవాడు కాలు జారి క్రిందపడే అవకాశాన్ని కొట్టిపారేయలేక. అంతేకాదు. చెట్టు నెక్కే శక్తి తనకు ఉన్నా, ఆ శక్తి వాస్తవానికి పరమాత్మదే అనే సత్యం గుర్తించటం వలన. డ్రైవరు స్టీరింగు పట్టుకునే ముందు రెండు చేతులు జోడిస్తాడు. నదికి నమస్కరించి ఈతగాడు నదిలో దూకుతాడు. బావిలో పడిన పాత్రను తీయటానికి బావిలో దిగేవాడు ముందుగా బావికి నమస్కరిస్తాడు. వంట చేసే ముందు తల్లులు పొయ్యికి నమస్కరిస్తారు. తనకు నైపుణ్యమున్నా ప్రమాదాన్ని డ్రైవరు మనసు నుండి తీసివేయలేడు. తనకు ఈత తెలిసినా తెలియని సుడులుంటాయనే సత్యాన్ని ఈతగాడు విస్మరించలేడు.

పాత్ర కొరకే బావిలో దిగుతున్నా, పాములుంటాయేమో అనే సంశయాన్ని దిగేవాడు తొలగించుకోలేడు. వంట అనేది మంటతో కూడుకున్న పని. చేయి కాలుతుందేమో; గ్యాసు లీక్‌ అవ్ఞతుందేమో-ఏమో! జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరికి తెలుసు? అందుకే, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్‌ ”అర్జునా! నీవ్ఞ నిమిత్తమాత్రంగా ఉండు అన్నాడు గీతలో శ్రీకృష్ణుడు. నిమిత్తమాత్రంగా ఉండు అంటే, అహంకారం లేకుండా ఉండమని అర్థం. ఇది కేవలం అర్జునునికి చేసిన ఉపదేశం కాదు. మనందరికీ ఉపకరించే సందేశము. సమరంలో అర్జునుడు నిమిత్తమాత్రుడు. సంసారంలో అందరూ నిమిత్తంగా ఉండాలని పరమాత్మ అభిప్రాయము. సన్యాసంలో అయితే మరీను.

మనం నిమిత్తం కాగలిగితే సర్వానికి పరమేశ్వరుడే సమాయత్తమవ్ఞతాడు. నీకు ఎంత శక్తి ఉన్నా, పరమాత్మ అనుగ్రహం లేకుండా నిన్ను నీవ్ఞ రక్షించుకోలేవ్ఞ. అశక్తులైనవారు కూడా పరమాత్మ కృపను పొంది శోభిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. మనం భక్తులమైతే మన వద్ద భక్తే ఉంటుంది. నిమిత్త మాత్రులం కాగలిగితే మన కార్యాలలో నారాయణుని పాదముద్రలే కదుల్తూ ఉంటాయి. పరమాత్మను విస్మరిస్తే మనలో అహంకారమే ఉంటుంది. భగవంతుని కార్యంలో నిమిత్తంగా చరించే భాగ్యం అందరికీ రాదు. భక్తి చేస్తేనే భక్తి కలుగుతుంది. మరేదో చేస్తే మరేదైనా రావచ్చు. చేసేది భక్తి కాకపోతే వచ్చేది ముక్తి కాలేదు. భక్తిని భారంగా కాకుండా బలంగా చేయాలి.

పాలకడలిని చిలికి అమృతాన్ని వెలికి తీసినట్లు, బ్రతుకును చిలికి భక్త్యామృతాన్ని సాధించాలి. మరి, విషం పుడితేనో! పుట్టనివ్వండి. మ్రింగేందుకు మహేశ్వరుడు మనతోనే ఉన్నాడు. ప్రతిబంధకాలన్నీ పరమాత్మ కృపతో పలచబడిపోతాయి. భక్తి పవిత్రము. భక్తి సాధన పవిత్రము. భక్తిలో అహంకారం చేరితే భక్తి మలినపడుతుంది. అపవిత్రమవ్ఞతుంది. అహంకారిలో ఉండేది భక్తి కాదని చెప్పలేము. అది భక్తే కావచ్చు. కాని, ముక్తికి ఉపకరించదు. పాలు పవిత్రమైన ఆహారము. విషం కలిస్తే? అప్పుడు కూడా అవి పాలే. కానీ, పాపయోగ్యం కావ్ఞ. విషం కలిసిన పాలలాగా అహంకారం కలిసిన భక్తి నిష్ప్రయోజనం. న వైరాగ్యా త్పరం భాగ్యం న బోధా త్వరమం సుఖం వైరాగ్యానికి మించిన భాగ్యము లేదు. జ్ఞానాన్ని మించిన సుఖం లేదు. వైరాగ్యముంటే భక్తి, భక్తి ఉంటే జ్ఞానము ఒకదానినొకటి అంటిపెట్టుకొని వస్తాయి.

అందుకనే శ్రీ ఆదిశంకరాచార్య స్వామి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ‘అమ్మా! జ్ఞాన వైరాగ్యముల కొరకు భిక్షమడుగుతున్నాను అన్నారు అన్నపూర్ణాష్టకంలో. పరమాత్మ ముందు జ్ఞానులే భిక్షగాళ్ళూ నిలబడ్డారు. రెండు చేతుల్తో సమానంగా శరప్రయోగం చేయగల వీరుడైన అర్జునుని (సవ్యసాచి) నిమిత్తంగా ఉండమన్నాడు శ్రీకృష్ణుడు. ఇక మనమేపాటివారము? పెంచుకొంటే తోక పెరుగుతుంది. తెగిన రోజు బాధనంతా మనమే భరించాలి. రాలేందుకు బ్రతుకు రాలేదు. కాని రాలిపోవటమనేది కాయానికి తప్పదు.

లేచిపోయేందుకే ప్రాణాలున్నాయి. రాలిపోయేందుకే దేహాలున్నాయి. తెలియక, తెలివిలేక జీవితంలో కొంతకాలం వృధా అవ్ఞతుంది. తెలిసిన తరువాత, తగిలించుకున్న బంధాలను తొలగించుకోలేక బ్రతుకు అనుక్షణం అలమటిస్తూ ఉంటుంది. ఎవరి కొరకు ఎవరూ లేరనే సత్యం ఏనాడైనా వంటబట్టవలసిందే. ఆ రోజేదో, ఈ రోజైతే ఈ క్షణం నుండే స్వేచ్ఛాగాలులు పీల్చుకోవచ్చు. పరిస్థితుల్ని చక్కబరచగలమేమో గాని ప్రారబ్దాలను సరిచేయలేము. జరిగేవి జరిగిపోనీ! నిమిత్తమాత్రం భవ!

– స్వామి సుందర చైతన్యానంద

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...