Monday, November 30, 2020

శివోహం

దీపం జ్యోతి పరం బ్రహ్మ...
దీపం జ్యోతి మహేశ్వర...
దీపేన సాధ్యతే సర్వం...
సంధ్యాదేవి నమోస్తుతే...

Sunday, November 29, 2020

శివోహం

దీపం జ్యోతి పరం బ్రహ్మ...
దీపం జ్యోతి మహేశ్వర...
దీపేన సాధ్యతే సర్వం...
సంధ్యాదేవి నమోస్తుతే...

Saturday, November 28, 2020

ఓం

భగవంతుణ్ణి ఏ పేరుతో పిలవాలన్నది’ చాలామంది సందేహం. ‘భగవంతుడు ఓంకార వాచ్యుడు కనుక, అతణ్ణి ఓమ్‌ అని పిలిస్తే చాలని’ పతంజలి మహాశయుడు ‘యోగదర్శనం’లో చెప్పాడు. వాసుదేవుడుకూడా ‘భగవద్గీత’లో ‘ఓమిత్యే కాక్షరం బ్రహ్మ’ అని, ‘భగవంతుణ్ణి ‘ఓం’కార నామస్మరణతో భజించాలని’ ఉపదేశించాడు. ‘ఓం’ భగవంతుని నిజమైన నామమే కాక ముఖ్యనామం కూడా. ‘ఓం’కారానికి ఉన్న ప్రశస్తి ఇతర నామాలకు లేదు. ‘ఓమ్‌'లో మూడు వర్ణాలున్నాయి. ‘అ, ఉ, మ్‌' అనేవి. అవి భగవంతుని ‘సృష్టి, స్థితి, లయ’లకు ప్రతీక. వ్యాసులవారు ‘వేదాంత దర్శనం’లో ‘భగవంతుడు ఎవరు?’ అన్న ప్రశ్నకు సమాధానంగా ‘జన్మాద్యస్యయతః’ అని సూత్రీకరించాడు. ‘ఎవరివల్ల జన్మ (సృష్టి), దానితోపాటు స్థితి లయలు సంభవిస్తున్నాయో వారే భగవంతుడని’ ఆయన సెలవిచ్చాడు. పతంజలి, వ్యాసుడు మొదలైన మహర్షుల ప్రతిపాదన వేదానుగుణమైంది. ‘యజుర్వేదం’లోని 40వ అధ్యాయంలో ‘ఓం క్రతో స్మర’ అనే వాక్కు గమనింపదగింది.

సర్వే వేదా యత్‌ పదమామనంతి

తపాంసి సర్వాణిచ యద్‌ వదంతి

యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి

తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యే తత్‌.

- కఠోపనిషత్తు (2-15)

‘తైత్తిరీయోపనిషత్తు’ మొదలుకొని అన్ని ఉపనిషత్తులూ మనకు శాంతి కలగాలని ‘ఓమ్‌ శాంతిః శాంతిః శాంతిః’ అనే మంత్రాన్ని ఉపదేశిస్తున్నాయి. నాలుగు వేదాలు దేన్ని పొందదగిందిగా వర్ణిస్తాయో, అన్ని తపస్సులు దేనిగురించి చెబుతున్నాయో, మోక్షార్థులు దేనికోసం ‘బ్రహ్మచర్య వ్రతాన్ని’ పాటిస్తారో ఆ పరబ్రహ్మ తత్తానికే ‘ఓమ్‌' అని పేరు. ‘ఓం’కారం భగవంతుని సహజనామం కాగా, ఇంకెన్నో పేర్లు భగవతత్తాన్ని తెలుపుతున్నాయి. భగవంతుడే సృష్టికర్త కనుక ‘సవిత’, విశ్వాన్నంతటినీ ప్రకాశింపజేస్తాడు కనుక ‘సూర్యుడు’. అంతటా వ్యాపకుడైన ‘పరమాత్మా’ ఆయనే. ప్రపంచాన్నే ఐశ్వర్యంగా కలిగినవాడు కనుక పరమేశ్వరుడు, జగత్తును క్రీడింపజేస్తూ, స్వయంగా ప్రకాశిస్తూ, ‘సచ్చిదానంద స్వరూపుడై’ ఉన్నాడు కాబట్టి, ‘దేవుడు’. సర్వజీవులలో అంతర్యామి అయినవాడు కనుక ‘నారాయణుడు’. ప్రాణికోటిని ఏడ్పించే ‘రుద్రుడు’, అన్నిటికంటే గొప్పవాడైన బ్రహ్మ ఆయనే. భగవంతుడు సకలైశ్వర్య సంపన్నుడై సేవింపదగినవాడు. అందువల్ల, ఏ పేరుతో పిలిచినా ఒక్కటే. ఐతే, ‘ఓం’కారమే అతని సహజనామం అన్న దానిని మాత్రం మరవరాదు. 

భగవంతునిలో ఎన్నో సుగుణాలున్నాయి. కొన్ని పేర్లు వాటిని తెలియజేస్తాయి. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడే కాదు, అన్ని లోకాలకు ఈశుడతడు ఒక్కడే. అతనితో సమానులుగాని, మించినవారుగాని లేరు. అన్ని పదార్థాలలో, జీవులలో అతడున్నాడు. అలాగే, అన్ని పదార్థాలూ, జీవులూ అతనిలోనూ వున్నాయి. అతడే సృష్టికర్త కనుక ‘బ్రహ్మ’, పోషణకర్త కనుక ‘విష్ణువు’, లయకారుడు కనుక ‘రుద్రుడు’గా వ్యవహరిస్తున్నాం. ఆది-అంతం లేనివాడు కనుక ‘అనంతుడై’నాడు. అన్ని పేర్ల అర్థం ఒక్క ‘ఓం’కారంతోనే సిద్ధిస్తుంది. మన పూర్వికులు అన్నివేళలా భగవంతుణ్ణి స్మరిస్తూ, ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అన్నారు. మూడు లోకాలను పాలించేవాడే మూడు దుఃఖాలను (ఆధ్యాత్మికం: శరీర సంబంధం, ఆధిభౌతికం: తోటిప్రాణులవల్ల కలిగేది, ఆధిదైవికం: ప్రకృతి విపత్తులద్వారా ఏర్పడేది) పోగొడతాడు. ‘ఓం’కారంలోని ‘అ+ఉ+మ్‌' అనే మూడు మాత్రలు భగవంతుని మూడు వంతుల మహిమను మాత్రమే తెలియజేస్తాయి. నాల్గవ వంతు మహిమ ఎవరికీ అందదు. అందుకే, అతణ్ణి ‘ఓంకారాతీతుడనీ’ పిలుస్తాం. 

ఆచార్య మసన చెన్నప్ప

అయ్యప్ప

ఎన్ని జన్మల తపమో...
ఎన్నిజన్మల పుణ్య పలమో...
ఇరుముడు ఎత్తుకొని నిన్ను చేరి నీ దర్శన కోసం ఎదురు చూసిన నా జన్మ ధన్యము కదా మణికంఠ...

హరిహర పుత్ర అయ్యప్ప శరణు...

శివోహం

శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ
నీ నామము నా పదమున దీపిక కానీ
నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ
మహేశా.....శరణు.

శ్రీరామ

కార్యసాధకుడు కపీశ్వరుడు...

సుందరకాండ పారాయణ చేస్తే ఆగిపోయిన పనులు కూడా అయిపోతాయని లోకంలో ప్రతీతి. అలా చెప్పడంలో పెద్దల ఉద్దేశ్యం కేవలం పారాయణ చేసినంతలో ఏదో హనుమచ్చక్తి కిందికి దిగి వచ్చి మన పనులన్నీ చేసి పెట్టేస్తుందని కాదు. సుందరకాండ మొత్తం సావకాశంగా, సావధానంగా చదివితే..  కార్యసాధనలో ఎదురయ్యే ఆటంకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో, వాటిని ఏ రకంగా తొలగించుకోవాలో అవగాహన చేసుకొంటారని పెద్దల ఉద్దేశం. ఏ విషయాన్నైనా అవగాహన చేసుకొని వాటిని మన జీవితానికి అన్వయం చేసుకొని ఆచరణలో పెడితే కాని పని ఉంటుందా? హనుమంతుడు సముద్రలంఘనం చేస్తుంటే మూడు రకాల ఆటంకాలేర్పడ్డాయి. మైనాక పర్వతం మర్యాద చేయడానికి అడ్డంగా వచ్చి నిలబడింది.

ఇది సాత్త్వికాటంకం. తర్వాత సురస అనే రాక్షసి ఆకాశమార్గానికి అడ్డంగా వచ్చి.. తన నోట్లో ప్రవేశించకుండా ఏ ప్రాణీ ముందుకు వెళ్లలేదని పంతం పట్టింది. ఇది రాజసాటంకం. ఆ తర్వాత సింహిక అనే ఛాయాగ్రాహిణి మాటామంతీ లేకుండా కిందికి లాగెయ్యడం మొదలుపెట్టింది. ఇది తామసాటంకం. కార్యసాధకుడైన హనుమంతుడు మూడు ఆటంకాలనీ మూడు రకాలుగా ఎదుర్కొన్నాడు. మైనాకుడు మర్యాదలు చెయ్యడం కోసం అడ్డుపడ్డాడు కాబట్టి.. అతనితో మర్యాదగానే మాట్లాడి, తిరిగివచ్చేటప్పుడు ఆగుతానని చెప్పి దాటి వెళ్లిపోయాడు. సురస ఆంజనేయుణ్ణి మింగేద్దామని నోరుతెరిచింది.

స్వామి దాంతో పోటీపడి దానికి రెట్టింపు స్థాయిలో శరీరం పెంచాడు. కొంతసేపయ్యాక సమయం వృథా అవుతోందని గమనించి.. అతి సూక్ష్మ శరీరంతో దాంట్లోంచి బయటపడ్డాడు. రాజసాటంకాల నుండి బయటపడే ఉపాయం అది. ఆ తర్వాత సింహిక.. ఆంజనేయుడి నీడ పట్టుకొని బలవంతంగా కిందికి లాగేస్తుంటే అది తమోగుణ ప్రవృత్తి అని గ్రహించి.. తన బలమంతా ఉపయోగించి దాన్ని పైకిలాగి ఒక్క గుద్దుతో పైలోకాలకి పంపేశాడు. అంటే తమో గుణానికి దండనతో బదులు చెప్పాడన్నమాట. అలామనం కూడా ఏదైనా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకొన్నప్పుడు ఎదురయ్యే ఆటంకాలు ఏ రకమైనవో గమనించుకొని ఆ రకమైన ప్రవృత్తితోనే వాటిని ఎదుర్కోవాలి. కొన్నింటిని మర్యాదగానే ప్రక్కకి తొలగించాలి. మరికొన్ని విషయాల్లో కొంతసేపు పోటీపడినా.. సూక్ష్మమైన ఉపాయాలను ఆలోచించి, ఆ పోటీ నుండి బయటపడి మన పని మనం చేసుకోవాలి. తీవ్రవాదం వంటి సమస్యలను అంతే తీవ్రంగా ఎదుర్కొని ఉక్కుపాదంతో అణచివేయాలి. అక్కడ మెతకదనం పనికిరాదు.

ఒక్క వ్యక్తి జీవితానికైనా, మొత్తం వ్యవస్థలో మార్పులకైనా ఈ త్రిగుణాత్మక వ్యూహం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ రకంగా సుందరకాండలో ఘట్టాల్ని అవగాహన చేసుకొని, మన జీవితానికి అన్వయించుకుని ఆచరణలో పెడితే కాని పని అంటూ ఉంటుందా? అందుకోసం సుందరకాండ అందరూ చదవాలి. కపీశ్వరుని కార్యసాధకత్వాన్ని అవగాహన చేసుకొని అనుసరించాలి.
సేకరణ: ఆంధ్రజ్యోతి

శివోహం

మనకు అన్నీ భగవంతుడే ఇస్తే
ఆయనకు మనమేమి ఇవ్వగలం
అలాగని ఏమీ ఇవ్వకుండా ఉంటే
కృతజ్ఞత అవుతుంది కదా !
తల్లిదండ్రులు మనకు ఎన్నో ఇచ్చారు
మనం అనుభవిస్తున్న జీవితం
వారు అనుగ్రహించిందే
ఇంక వారికేమి ఇవ్వగలం
అలాగని వదిలేయలేం కదా !
వారియెడల భక్తిని కలిగి ఉండాలి
మనం ఏ చిన్న సేవ చేసినా
మురిసిపోతారు తల్లిదండ్రులు
భగవంతుడుకూడ అటువంటి
అల్పసంతోషియే ఏ కొంచెమిచ్చినా
పరమానంద పడిపోతాడు
అటువంటిది మననే కానుకగా
సమర్పిస్తే ఎంత మురిసిపోతాడు
అంటే బ్రహ్మస్మి అనే భావంతో
నీవే నేననుకో అనే భావాన్ని
వ్యక్తం చేయడమే నిజమైన కానుక

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివ నీ భక్తియే ముక్తికి మార్గము...

మంచీ చెడ్డా,పాప పుణ్యా,భారమిక 
నీదే కదా తండ్రి...

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, November 27, 2020

శివోహం

శివా!గమ్మత్తుగ మత్తు ఆవరించింది
కనులు మూత పడుతున్నాయి 
నీ కోసం వెతుకుతున్నాయి
మహేశా ..... శరణు.

Thursday, November 26, 2020

శివోహం

కన్న వారినీ కన్న భూమినీ...
ఎదో ఓ రోజు శుభ ముహూర్తం పెట్టి...
నువ్వు దూరం  చేస్తావని తెలిసి కూడా...
ఏరికోరి నిన్నే ఎంచుకున్న శంభో.
ఎందుకంటే చిట్టచివరికి నువ్వే తోడుంటావని...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! భవసాగరము దాట ఈత నేర్పించు
ముక్తి పదమున సాగ భక్తి నెరిగించు
నీ నామమే శ్వాసగా స్మరణలోనుంచు
మహేశా . . . . . శరణు .

శివోహం

వేగిరపడుతున్న ఈ మనసుని
నువ్వు ఎప్పుడు 
ఆదరిస్తావు స్వామి!!
నీ అడుగుల తివాచీలా
 ఉబలాటపడి పరిచిన 
 హృదయ సీమకి
నువ్వు వచ్చేవని,
 అంతా నీ అడుగుల 
అచ్చులే ముద్రితమని
తెలిసేరోజు కోసం
 ఈ జీవిత సమస్తం
 వేచిఉన్నది,
 ధర్మానికి వేదిక.... 
నీ ముందర ఉండడమే
నా ఆత్మకు కాంక్ష....
నేను అంతా నిరీక్షణగా 
మారి ఉన్నాను,
నీ ప్రతిక్ష పొందడమే పరమావధిగా
ఈ అనంత జలనిధి 
దాటెందుకు నీచేయూతలో
 నాలోనుండి
 నాలోకి 
ప్రయాణించే 
గమనాన్ని 
వేగంగా మార్చు,
మరెక్కడ ఆగకుండా
నిన్ను చేరేందుకు
ఉరవడి ఉండనీ 
గట్లు తెగిపోయి స్వామి...

Wednesday, November 25, 2020

శివోహం

అనుకున్నామని జరగవు అన్ని...
అనకోలేదని ఆగవు కొన్ని...
జరిగేవన్నీ శివుని చిత్తమని అనుకోవడమే మంచిది...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!ఆశల సౌధం ఆహుతయ్యేలోగా
నీవు ఒకసారి అనిపించు చాలు
అది కూర్చును కదా ఎంతో  మేలు
మహేశా . . . . . శరణు .

శివోహం

శుష్కించి 
శిథిలమయ్యే శరీరం
నీకు ఆవాసమా ?

దహించబడి 
ధూళిగా మారిపోయే  దేహం
నీకు అభిషేకమా ??

తెలియని సత్యం 
నీ వేదాంతంగా !

తెలిసిన ధర్మం 
నీ వైరాగ్యంగా !!

శివోహం  శివోహం

శివోహం

ఈశ్వరుడు మిమ్ములను స్మరించకపోతే 
మీరు ఈశ్వరుని స్మరించలేరు.
అసలు ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలనే తలంపే మీకు పుట్టదు. సత్యాన్ని తెలుసుకోవాలనే బలమైన కోరిక మీకు కలుగుతుంటే 
ఈశ్వర సంకల్పం మీ మీద ఉన్నట్లే!

భగవాన్ రమణ మహర్షి

శివోహం

పిచ్చివాడివో  వెర్రివాడివో
తిక్కలోడివో  తెలియనోడివో 

జడలు కట్టు  ఆ జటలు ఏలనో
నెత్తి మీద  ఆ గంగ ఏలనో 

వంక బూనిన  జాబిలేలనో
మెడను చుట్టు  ఆ పాములేలనో 

మూడు కన్నుల  మర్మమేలనో
మౌన ముద్ర  ఆ ధ్యానమేలనో 

జనన మరణాల   చక్రమేలనో
కట్టె కొనల  ఆ చితులు ఏలనో 

భిక్షమెత్తు  ఆ బ్రతుకు ఏలనో 
కాటి కాపరి  కొలువు ఏలనో 

ఒంటి నిండా  ఆ బూడిదేలనో
తెలియరాని  ఆ తత్వమేలనో 

శివోహం  శివోహం

Tuesday, November 24, 2020

శివోహం

ఐహిక భోగం విడిచేది
ఐహిక భోగం మరిచేది
మమకారములను విడిచేది
మదమత్సరములను తుంచేది అయ్యప్ప దీక్ష

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శివోహం

ఈశ్వరుడు అనంత వైభవము కలవాడు
అలాగే ఈశ్వర నామము కూడా అనంత
వైభవంతో శోభిస్తుంది  ........

కాని  సాధకులకు ఉపయుక్తంగాను 
సులభ సాధ్యం గాను ఉండటానికి 
సహస్ర నామాలుగా నిర్ణయించి 
స్తోత్రాలను అందించారు 
మన  ఋషయ జ్ఞానులు...

భగవంతుని రూపాన్ని చూడగానే
ఇంద్రియాలు శాంతిస్తున్నాయి
మనస్సు ప్రశాంతతను పొందుతుంది
పరమేశ్వరుని నామాలను కీర్తించగానే
బుద్ధికి ప్రశాంతత చేకూరుతూ ఉంది
హృదయంలో ఏదో హాయిని.ఆహ్లాదాన్ని
అనుభవిస్తోంది ఇది పారమార్థిక ప్రగతికి
దోహద పడుతుంది  ............!!

నామరూపాలలో నామం ఎక్కువ 
శక్తివంత మైనది నామానికి ఉన్నంత 
శక్తి  రూపానికి ఉండదు !చాలా కాలం 
క్రితం చూసిన వ్యక్తిని గుర్తు తెచ్చుకొనే 
సమయంలోఅతని పేరు జ్ఞాపకం మొస్తుంది
రూపం స్పష్టంగా విదితం కాదు అతను 
నాకు తెలుసు కానీ అతని రూపమే 
జ్ఞాపకం రావడం లేదు అంటూ ఉంటాము
అంతే కాదు ఒక వ్యక్తి జీవితంలో
అతని రూపం దశాబ్దానికి దశాబ్దానికి
గొప్ప మార్పుతో కనిపిస్తూ ఉంటుంది
కాని శతాబ్దం జీవించినా నామం మారదు

భగవన్నామం పవిత్రమైనది
పాపాన్ని సమూలంగా ప్రక్షాళనం చేస్తుంది
నామాన్ని ఎప్పుడైనా చేయవచ్చు
ఎక్కడైనా చెయ్యవచ్చు
ఎవ్వరైనాచెయ్యవచ్చు
నామసాధన సులభ మైనది
నిరపాయ మైనది మధుర మైనది
మరపు రానిది అందుకనే 
సకల సాధనలలో నామానికి
అగ్రతాంబూలం అందింది
నామంలో నామి వైభవము
స్తుతియే ప్రధానంగా ఉండటం చేత
నామసాధన అధిక్య మని చెప్పబడింది

శివోహం

భౌతికంగా ఉన్న దూరం
మానసికంగా దగ్గర అవుతుంది తండ్రి...

అందుకే నా గుండెల్లో ఉండిపో...
అప్పుడు శ్వాస దూరంలో ఉంటావు...

ఊపిరి పీల్చకుండా ఉండలేను
నిను తలవకుండా గడప దాటలెను...

మహాదేవా శంభో శరణు...

Monday, November 23, 2020

శివోహం

నుదుటి రేఖలని నీ విబూధితో ముంచేస్తున్నాను...
నిత్యం నీనామం పట్టుకుని వేలాడుతున్నాను...
అయినా నీకు నాపై దయరాలేదు అంటే
నేను నీకు నచ్చలేదా?...
లేక నిన్ను నేను మెప్పించలేక పోవుచున్నానా?
ప్రతిసారీ పరమపద సోపానంలో పాతాళానికి తోసేస్తున్నావు...

మహాదేవా శంభో శరణు...

Sunday, November 22, 2020

శివోహం

శివా!మాలో మూడింటిని  ఒకటి చేయి , 
రెండింటిని తీసివేయి, 
ఆ పైన ఆరింటి పై జయము నీయి.
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా! నీ కరుణకు హద్దేది
 నీ రచనకు పద్దేది
నిను చేరని మరణమేది
మహేశా.....శరణు.

శివోహం

శివా!మాలో మూడింటిని  ఒకటి చేయి , 
రెండింటిని తీసివేయి, 
ఆ పైన ఆరింటి పై జయము నీయి.
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
చిరాకుతో నేను మాట తులినా...
పరాకుతో నా నడక తడబడినా... 
నన్ను మన్నించి తోడుగా ఉండు...
తనయుడు తప్పు చేస్తే దండించి సరిదిద్దేది తండ్రినే కదా...
నాకు మార్గదర్శకం చేయి తండ్రీ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

గుప్పెడు కూడా లేని నా గుండె...
నీకు ఓ ఆలయం అయింది...
నీ మైమరపులో నా మనసు మునిగి...
తన్మయత్వంతో తేలియాడుతుంది...
మహాదేవా శంభో శరణు...

Saturday, November 21, 2020

శివోహం

మానవజన్మములో గడిపి నరులకు....
మోక్షమార్గమును చూపించిన....
హరిహర తనయుడి ఆయ్యప్ప....
నీ నామమే కలియుగంలో తరకమంత్రాం...
ఓం శ్రీస్వామియే శరణం ఆయ్యప్ప

శివోహం

జీవితం అనే స్మశానంలో...
కాలం అనే  కాష్టం లో...
జన్మ కాలి బూడిద అవుతోంది...
మహాదేవా శంభో శరణు....

Friday, November 20, 2020

శివోహం

నీవే దిక్కని నమ్మిన నీ భక్తులను ఆదుకోవడంలో ఆలస్యం చేస్తావేమో...

కాని అన్యాయం మాత్రం చేయవు తండ్రి...

కడవరకూ నువ్వంటే అదే నమ్మకం... 

దయతో అనుగ్రహించుము... 

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నీటి బుడగను మనిషిగ జేసి
ఆ మనిషి జీవితం నీటి బుడగగ జేసి
మాయ చేసావు లీల చూపేవు 
మహేశా......శరణు.

Wednesday, November 18, 2020

శివోహం

శివా!ఎగరేసి ఏ తలైనా ఎగిరిపోవు
ఎగిరిన తల నాటితొ కనుమరుగైపోవు
ఆ పైన అహమంత తొలగిపోవు
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో ! బైరాగినంటావు
ముళ్లోకాలు ఏలుతుంటావు...
ఆది బిక్షువునంటావు
ఆదిశక్తి అంబతో ఉంటావు...
నీ లీలలు వర్ణింప నా తరమా తండ్రీ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

బరువైన బాధలను కన్నీటితో...
మోసేస్తూ ఉండాలి మరి...
ఎందుకంటే జీవిత ఒక నాటకం...
ఆటాడించే వాడు ఒకడుంటాడు...

శివా నీ దయా తండ్రి....

Tuesday, November 17, 2020

శివోహం

శంభో ! నా పిలుపు తలపు... 
నీతో అనుసంధానము గావించుము తండ్రీ... 
నీవు తప్ప నాకు దిక్కేవ్వరు...
మహాదేవా శంభో శరణు... 

శివోహం

మణికంఠ! నాకు మంత్రము తెలియదు...
తంత్రము తెలియదు... !! 
తెలిసిందల్లా నువ్వున్నావని నమ్మడం నిను అనుసరించడం...

హరిహర పుత్ర అయ్యప్ప శరణు..
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!కర్మాచరణల నేను కూడివున్నా
కర్మ ఫలముల వెంట నన్ను తిప్పకోయి
అవి జనన మరణములందు తిప్పునోయి
మహేశా . . . . . . శరణు .

జైశ్రీరామ్

హనుమ!!!
నీ మనసు మానవ సరోవరం....
నీ తేజస్సు హిమాలయం....
నీ రూపం రుద్రరూపం...
నీ శౌర్యం ప్రభాదివ్యకావ్యం....
నీ నామస్మరణ సర్వ దుఃఖ పరిహారం... 

జై శ్రీరామ్ జై జై హనుమాన్
ఓం శివోహం... సర్వం శివమయం

Monday, November 16, 2020

శివోహం

శివా!ఈ రథమును కూర్చిన నీవే
సారథినెరిగించు వారధి చూపించు
నిను చేరుట గమనించు 
మహేశా . . . . . శరణు

శివోహం

ఖర్మ ప్రాబర్ధమనే చీకటిలో భగవంతునికై
శ్రద్ధగా నమ్మకమే దీపాన్ని వెలిగించు...

ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, November 15, 2020

శివోహం

నిన్ను చూడని నిమిషాన....
నీ నామ స్మరణా చేయని నిమిషాన....
అన్ని బంధాలు వదిలించుకున్న నిమిషన.....
ఆ నలుగురు నన్ను రోధనతో బయటికి పంపినప్పుడు....
ఏ దిక్కు లేని నాకు నిదిక్కే కదా సదాశివ......
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నీవి విభూతులు నావి అనుభూతులు
అనుభూతికే కాని అక్షులకు కానరావు
కలవు నీవని ఒప్పుకుంటాం కానరావని చెప్పుకుంటాం.....
మహేశా .....  శరణు..

జన్మదిన శుభాకాంక్షలు VN రుద్రన్ష్ నాయక్

ఆయుష్మాన్ భవ...
శతాయిష్మాన్ భవ...

నీ ఉత్సాహం తేజోమయమై
నీ ఉల్లాసం కాంతిపుంజమై
నీ యవ్వనం  ఒక సంకల్పమై
నీ ప్రతి కార్యం ఒక విజయపతంగమై
నీ విజ్ఞానసంపద ఒక నూతన తేజమై
నీ ఆనందం ఒక ఆహ్లాదపు కెరటమై
మాకు నీవు ప్రియ పుత్రుడవై
నీ  గురువులకు నీవు ప్రియ శిష్యుడవై
నీ స్నేహితులకు నీవు దిక్సూచివై
భవిష్యత్తులో ఒక  రాకుమారుడులా
నీ భవితను సువిశాలంగా విస్తరింపచేస్తూ
విక్రమార్కుడువై , శ్రీనికేష్ రుద్రన్ష్ వై
నువ్వెంత ఎదిగినా   మా అందరి హృదయాలలో
చిన్ని మణికంఠ వై ,చిరకాలం చిరంజీవిగా వర్దిల్లమని
నీ జన్మ దిన శుభ సందర్బంగా శుభాశీస్సులు తెలుపు
మా హృదయ మందార దీవెనలతో...

జన్మదిన శుభాకాంక్షలు VN రుద్రన్ష్ నాయక్...

ఇట్లు,
మీ అమ్మ నాన్న❤️

దీపావళి శుభాకాంక్షలు

దీపం జ్యోతి పరం బ్రహ్మ
దీపం జ్యోతి మహేశ్వర
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదేవి నమోస్తుతే

శివోహం

శివం... సుందరం 
అంతర్యామి అయిన పరమేశ్వరుడు ఒక్క భూలోక వాసులకే కాదు, త్రిలోక నివాసులకూ ఆరాధ్యుడు. ఆయన ధరించిన విభూతి కోసమే ఇంద్రాది దేవతలు ప్రార్థిస్తారు. రావణాది దానవుల శివభక్తి లోక విదితమే. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కైలాసగిరినే తన భుజస్కంధాలపై ఎత్తుకొన్నవాడు దశకంధరుడు. స్వామి ఎంతకూ ప్రత్యక్షం కావడం లేదని, తన ఉదరం నుంచి పేగుల్ని వెలికి తీసి వీణలా మోగించిన భక్తి ఆ దశాననుడిది! దేవతాకోటిలోని వారు గంధర్వులు. గానప్రియులైన వీరు అపూర్వ శివభక్తి పరాయణులు. అలాంటి గంధర్వుల్లో ఒకరైన పుష్పదంతుడికి సంబంధించిన శివభక్తిని ఒక కథ విపులీకరిస్తుంది. శివుడి మహిమను అది స్పష్టంగా బోధించడంతో పాటు, భక్తిలో గల విశిష్టతనూ తెలియజేస్తుంది.

పూర్వం శివభక్తుడైన ఒక రాజు ఉండేవాడు. అతడు ప్రతి నిత్యం పుష్పవనంలో పూచిన పూలతో శివుణ్ని అర్చించేవాడు. ఒకనాడు ఉదయమే పూలు తెమ్మని భటుల్ని అక్కడికి పంపాడు. అక్కడ వారికి ఒక్క పూవైనా కానరాలేదు. పూలు ఏమయ్యాయని ఉద్యానవన పాలకుణ్ని అడిగారు. గత రాత్రి ఎవరో వనంలోకి దూరి పూలు తీసుకెళ్లి ఉంటారని బదులివ్వడంతో, భటులు అదే విషయాన్ని రాజుకు నివేదించారు. రాత్రివేళల్లోనూ కాపలా కాయాలంటూ ఆయన అనేకమంది రక్షక భటుల్ని నియమించినా, పూలు మాయమవుతున్నాయి. భటులు రాజుకు విన్నవించారు. శివభక్తుడైన ఆయనకు విషయం అప్పుడు అర్థమైంది. ఎవరో శివభక్తుడు ‘తిరస్కరిణి’ (ఎవరికీ కనిపించకుండా ఉండే శక్తి)తో ఆ పనిచేస్తున్నాడని గ్రహించాడు.

రాజు వెంటనే ఆ పూలతోటలోని దారి అంతటా శివ నిర్మాల్యం (శివుడికి పూజలో సమర్పించిన పవిత్ర పుష్పాలు) చల్లించాడు. అలా చేయడం వల్ల అజ్ఞాత భక్తుడు ఆ పూలను తొక్కి తన మహిమ కోల్పోతాడని, అప్పుడు అతణ్ని సులభంగా పట్టుకోవచ్చని భావించాడు. ఆయనఆదేశించినట్లే భటులు చేశారు. ఎప్పటిలాగే రాత్రివేళ పూలతోటలోకి ప్రవేశించిన గంధర్వుడు ఆ శివ నిర్మాల్యాన్ని తొక్కడంతో, అతడి దివ్య మహిమలన్నీ నశించాయని పురాణ గాథ. అతడి తిరస్కరిణి శక్తి, ఆకాశ గమన శక్తి మాయమయ్యాయి. తెల్లవారితే రక్షకభటులు పట్టి బంధిస్తారని భయపడిన గంధర్వుడు- దయామయుడు, సంకట నాశకుడు అయిన శివుణ్ని రాత్రంతా స్తుతిం చాడు. శివుడు అతణ్ని అనుగ్రహించి, దివ్య శక్తుల్ని తిరిగి ప్రసాదించాడు. అప్పుడు ఆ గంధర్వుడు తన లోకానికి తిరిగి వెళ్లిపోయాడు. ‘పుష్పదంత’ నామధేయుడైన ఆ గంధర్వుడు చేసిన ‘శివ మహిమ్న స్తోత్రం’ జగత్తులో ప్రసిద్ధమైంది.

శివ యథార్థరూపం ఎంతో గొప్పది. స్వర్గమార్గం నుంచి ప్రవహిస్తూ వస్తున్న ఆకాశగంగ ప్రవాహంలో, నక్షత్రాలు చిన్నపాటి బిందువుల్లా మారుతున్నాయి. సముద్రాలతో చుట్టిన భూమి ఒక చిన్న దీవిలా కనిపిస్తోంది. నదులు, సముద్రాలు, భూమి- అన్నీ శివుడి శిరస్సుపై బిందువులా చేరాయి. ఇదీ స్వామి దివ్య స్వరూపం! ఈ రూపాన్ని ఎవరైనా వూహించగలరా... అంటూ సుందర వర్ణనలతో శివపారమ్యాన్ని విశదం చేస్తుందీ స్తోత్రం! అందుకే ఇది శివభక్తుల పాలిట అమృత సింధువు. ఆయన మహిమ అనంతమని వారందరి ప్రగాఢ విశ్వాసం!.

శివోహం

ఎగసి పడే భాధనంత...
కంటనీరుగా కారకుండా.  
గుపెడంత గుండెలోన....
భద్రపరిచి దాచి ఉంచ...
దాగలేనని అది అలల కడలిల...
ఉరకలేస్తూ పరుగుతీస్తూ...
మది భంధనాలను తెంచుకుంటు...
వాన చినుకుల కన్నుల నుండి కారుతుంది...
నిన్ను అభిషేకించడానికి....

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!అభిషేకాన నీవు చెప్పకనే చెబుతున్నా
నీకేవి అంటవని,మమ్మ అంటించుకోవద్దని
నీ మాటే వింటున్నా చేయలేకపోతున్నా 
మహేశా. . . . . శరణు .

శివోహం

శివా! చిరాకు పడుతున్న నా మనసుకు
పరాకు చెబుతోంది  నీ నామం
చిరాకు తొలగించు పరాకు నెరిగించు
మహేశా ..... శరణు.

శివోహం

శివా!ఒకసారి చూడు నావైపు
ఆ కాంతి మార్గాన పయనించి
నిటలాక్ష నిన్ను చేరుకుంటాను 
మహేశా . . . . . శరణు .

Wednesday, November 11, 2020

శివోహం

చెడితే కానీ తెలియని.....
చెపితే కానీ అర్ధం కానీ....
ఆచరిస్తే కానీ అర్థం కానివి
శివ తత్వాలు , జీవిత రధచక్రాలు...
నిన్ను నీనామంతోనే విసిగిస్తాను...
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 
అంటూ...
నీరాకకోసం ఎదురుచూస్తున్న...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నడుము వరకు ములిగి పోయేను
నిను చేరు మార్గమ్ము మరచిపోయేను
చేయూత నిచ్చి నీ చెంత చేర్చుకోవా
మహేశా . . . . . శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...